// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Medaram Jatara: మేడారంలో అద్భుతం.. నేను పచ్చి రక్తం తాగుతా,  సమ్మక్క చెప్పిన జోస్యం వింటే పూనకాలే..

Medaram Jatara: మేడారంలో అద్భుతం.. నేను పచ్చి రక్తం తాగుతా, సమ్మక్క చెప్పిన జోస్యం వింటే పూనకాలే..

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర భక్తజన సంద్రమై కనిపిస్తోంది. లక్షలాది మంది భక్తులు అడవి తల్లుల దర్శనం కోసం తరలివస్తుండగా… మేడారంలోని ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా సమ్మక్క తల్లి కొలువై ఉన్నట్లు భావించే చిలకల గుట్ట వద్ద నెలకొన్న దృశ్యాలు భక్తుల అచంచల విశ్వాసానికి అద్దం పడుతున్నాయి. ఇక్కడ జాలువారే ‘సమ్మక్క జలధార’ భక్తులకు అత్యంత ప్రత్యేకం. పురాణ గాథల ప్రకారం.. యుద్ధం ముగిసిన తర్వాత […]

Medigadda Barrage: పార్లమెంటులో కేంద్రం సంచలన ప్రకటన.. అత్యంత ప్రమాదకర స్థితిలో మేడిగడ్డ బ్యారేజ్!

Medigadda Barrage: పార్లమెంటులో కేంద్రం సంచలన ప్రకటన.. అత్యంత ప్రమాదకర స్థితిలో మేడిగడ్డ బ్యారేజ్!

Medigadda Barrage: దేశంలో డ్యాంల భద్రత, పాత డ్యాంల ప్రస్తుత పరిస్థితిపై పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ముఖ్యంగా తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ను అత్యంత ప్రమాదకరమైన ‘క్యాటగిరి-1’ కింద వర్గీకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. డ్యాంల భద్రతపై లోక్‌సభలో టిడిపి ఎంపీలు జి. లక్ష్మీనారాయణ, డాక్టర్ బైరెడ్డి శబరిలు అడిగిన ప్రశ్నలకు జలశక్తి శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2025 వర్షాకాలం తర్వాత నిర్వహించిన […]

Kavitha: తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే.. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే.. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ఈ అంశాన్ని సాగదీస్తోందని..  విచారణలో చిత్తశుద్ధి లోపించిందని ఆమె విమర్శించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న […]

Tummala Nageswara Rao: గత ప్రభుత్వం కేంద్ర నిధులను వదిలేసింది.. మేము వాడుకుంటున్నాం.. కేంద్ర మంత్రితో మంత్రి తుమ్మల సమావేశం!

Tummala Nageswara Rao: గత ప్రభుత్వం కేంద్ర నిధులను వదిలేసింది.. మేము వాడుకుంటున్నాం.. కేంద్ర మంత్రితో మంత్రి తుమ్మల సమావేశం!

Tummala Nageswara Rao: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆరు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కేంద్రానికి వివరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి గత ఏడాది కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సద్వినియోగం చేసుకుందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్ల […]

Hyderabad Crime: ఆఫీస్ ట్రిప్‌లో అరాచకం.. ఆపై వేధింపులు.. మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో హెచ్ఆర్ అరెస్ట్

Hyderabad Crime: ఆఫీస్ ట్రిప్‌లో అరాచకం.. ఆపై వేధింపులు.. మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో హెచ్ఆర్ అరెస్ట్

Hyderabad Crime: ప్రస్తుత సమాజంలో మహిళల భద్రత అత్యంత ఆందోళనకరమైన విషయంగా మారింది. అడుగుపెట్టిన ప్రతిచోటా మహిళలు ఏదొక రూపంలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్న స్త్రీలకు పనిచేసే చోట ఎదురయ్యే సవాళ్లు వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉద్యోగ రీత్యా బయటకెళ్లే అమ్మాయిలకు ఆఫీసులే రక్షణ కవచాలుగా ఉండాలి. కానీ.. దురదృష్టవశాత్తూ కొన్ని చోట్ల అవే వారికి నరకప్రాయంగా మారుతున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, […]

KTR: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌పై కక్షసాధింపా? ఫోన్ ట్యాపింగ్ నోటీసులపై కేటీఆర్ సంచలన ట్వీట్

KTR: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌పై కక్షసాధింపా? ఫోన్ ట్యాపింగ్ నోటీసులపై కేటీఆర్ సంచలన ట్వీట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ‘చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ […]

Neerus Showroom Seized: రంగనాథ్ యాక్షన్.. బంజారా హిల్స్ లో నీరూస్ షోరూమ్ సీజ్..!
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వడ్డించిన భోజనం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, వికారంతో ఇబ్బంది పడటంతో పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఆసుపత్రికి తరలింపు..  విద్యార్థుల పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు […]

Harish Rao: కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
BRS : ‘దానం’ సంచలనం.. డిఫెన్స్‌లో బీఆర్ఎస్.. ఏం జరగబోతుంది?
Hyderabad News: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కాంగ్రెస్ నేతల రియాక్షన్స్, విచారణలో అన్నీ తెలుస్తాయి
Yadadri Temple Gold Missing: యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం.. అసలు దొంగలు వారేనా?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు, చివరి అంకానికి
CM Revanth Reddy: తెలంగాణ విద్యా ముఖచిత్రాన్ని మారుద్దాం.. హార్వర్డ్ వేదికగా యువతకు సీఎం రేవంత్ పిలుపు

CM Revanth Reddy: తెలంగాణ విద్యా ముఖచిత్రాన్ని మారుద్దాం.. హార్వర్డ్ వేదికగా యువతకు సీఎం రేవంత్ పిలుపు

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS) విద్యార్థులతో జరిపిన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానం మేరకు ఆయన వారిని కలిశారు. తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా విద్యార్థులతో గడిపిన సీఎం, వారి కెరీర్ లక్ష్యాలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో […]

Big Stories

Advertisement
×