E-Paper
Advertisement

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముగిసిందా?

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముగిసిందా?
Advertisement

Viveka Murder Case : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. మరి సీబీఐ దర్యాప్తును పూర్తి చేసిందా లేదా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై వివేకా కుమార్తె సునీత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 3న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అదేరోజు సుప్రీంకోర్టుకు వివేకా హత్య కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ వివరించనుంది. దర్యాప్తు ముగిసిందా..? విచారణ గడువు పెంచమని సీబీఐ కోరుతుందా ? ఈ విషయాలపై సందేహాలు ఉన్నాయి.

Advertisement

మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసుపై విచారణ జరిగింది. నిందితులు భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిను చంచల్‌గూడ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు.

ఇరుపక్షాల వాదనల విన్న నాంపల్లి కోర్టు నిందితుల రిమాండ్‌ను జూలై 14 వరకు పొడిగించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుబంధ ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో సీబీఐ దాఖలు చేసింది. గతంలోనే దర్యాప్తు సంస్థ రెండు ఛార్జ్‌షీట్‌లు కోర్టుకు సమర్పించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×