E-Paper
Advertisement

Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ బ్లాస్ట్.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ బ్లాస్ట్.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Advertisement
sahithi pharma

Atchutapuram Sez: అనకాపల్లి జిల్లాలో సాహితీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదం నుంచి 25 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.

కెమికల్ ల్యాబ్ కావడంతో హానికరమైన పొగ ఇబ్బందిపెడుతోంది. మంటల తీవ్రతకు ఫైర్ సిబ్బంది సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మంటలు, పొగలు భారీగా ఎగసిపడుతుండటంతో.. లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. అగ్ని మాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాకే, లోపల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని చెబుతున్నారు.

Advertisement

ముందుజాగ్రత్తగా, చుట్టుపక్కల ప్రాంతాల్ని పోలీసులు ఖాళీ చేయించారు. సమీపంలోనే పలు ఫార్మా పరిశ్రమలు ఉండటంతో.. మంటలు వ్యాపించి వాటికీ అంటుకుంటాయేమోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. సాహితీ ఫార్మా నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×