E-Paper
Advertisement

Modi : మెట్రోలో మోదీ జర్నీ.. ఎక్కడంటే..?

Modi : మెట్రోలో మోదీ జర్నీ.. ఎక్కడంటే..?
Advertisement

Modi : ప్రధాని మోదీ రూటే సెపరేటు. ఆయన సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారని ఎన్నో సందర్భాలు రుజువు చేశాయి. సామాన్యులతో ముచ్చటించేందుకు ఆసక్తిగా ఉంటారు. తాజాగా మోదీ ఢిల్లీ మెట్రోలో సామాన్యుడిగా ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మెట్రోలోనే వెళ్లారు.

సామాన్య ప్రయాణికుల మాదిరిగానే మెట్రో రైలులో కూర్చుని ప్రయాణించారు. కొందరు విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో మాట కలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారితో దిగిన ఫొటోలను మోదీ ట్విటర్‌లో షేర్ చేశారు. బీజేపీ కూడా మోదీ మెట్రో రైలు ప్రయాణ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌ గా మారాయి.

Advertisement

మోదీ ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. 1922లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ చట్టం ప్రకారం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీని యూజీసీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా గుర్తించింది. 2022 నాటికి ఈ విశ్వవిద్యాలయానికి వందేళ్లు పూర్తయ్యాయి. గతేడాది మే 1న శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఏడాదిపాటు ఈ వేడుకలు నిర్వహించారు. ఇప్పుడు ముగింపు ఉత్సవాలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×