E-Paper
Advertisement

SSMB29 Update : జక్కన్న మొదటిసారి ఇలా.. సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడే..?

SSMB29 Update : జక్కన్న మొదటిసారి ఇలా.. సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడే..?
Advertisement

SSMB29 Update : టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమాను చేయనున్నాడు మహేష్ బాబు.. ఈ మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు. దాంతో ఈ మూవి కోసం అందరు ఎదురు చూపులు చూస్తున్నారు. ఎప్పుడుడెప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా? అని ఓ వైపు మహేష్ ఫ్యాన్స్, మరోవైపు రాజమౌళి ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికి అప్డేట్ ను అనౌన్స్ చేశారు. నేడు ఈ మూవీని గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చెయ్యనున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరిలో ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమం జరగనుంది..

ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా మొదలవుతుందా?.. మొదలైతే ఎప్పుడు మొదలవుతుంది అని అంతా చర్చించుకుంటున్నారు.. తాజాగా ఈ మూవీ లాంచింగ్ కు జక్కన్న ముహూర్తం ఫిక్స్ చేశారు. నేడు ఉదయం పూజాకార్యక్రమాల తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.. అయితే రాజమౌళి సినిమాలు అంటే పబ్లిసిటీ కూడా ఉంటుంది. కానీ ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమానికి మాత్రం సెలెబ్రేటిలను కానీ మీడియాను కానీ పిలవలేదని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హడావిడి లేకుండా పూజా కార్య క్రమాలను పూర్తి చెయ్యనున్నారట.అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన ఫార్మాట్ ని మార్చినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇది వరకు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా దానిని మొదలు పెట్టిన సమయంలోనో లేక కొంచెం గ్యాప్ తర్వాత కానీ ఆ సినిమాకి సంబంధించి డెఫినెట్ గా ప్రెస్ మీట్ పెట్టేవారు. కానీ ఇపుడు మహేష్ తో సినిమాకి ఇలాంటి ప్రెస్ మీట్ లు ఏవి ఉండబోవు అని తెలుస్తుంది. దీంతో జక్కన్న మొదటిసారి ఈ స్టెప్ తీసుకుంటున్నారా అనిపిస్తుంది. మరి ఇపుడు సింపుల్ గా ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ చేసేసి నెక్స్ట్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ ని పెడతారేమో చూడాలి మరి..

Advertisement

ఇక పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసమే అని చెప్పాలి. మరి మహేష్ కెరీర్ లో 29 వ చిత్రంగా దీనిని గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక జనవరి 2న అవైటెడ్ ముహూర్త కార్యక్రమాల తో సినిమా లాంఛ్ కాబోతుండగా అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ను ఆరు దేశాల్లో షూటింగ్ చెయ్యనున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాదు బాహుబలి లాగా రెండు భాగాలు గా జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం 2027లో విడుదల కానుంది.. ఈ మూవీకి మ్యూజిక్ ఇవ్వబోతున్న యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.  ఇక ఈ మూవీకి ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు టాక్.. మరి చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×