E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్ ను కన్పీజ్ చేయాలనుకున్న మనోహరి

Nindu Noorella Saavasam Serial Today November 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్ ను కన్పీజ్ చేయాలనుకున్న మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

రోడ్డుకు అడ్డంగా రాళ్లు ఉండటంతో రాథోడ్ కారు ఆపేస్తాడు. వెనక కారులో వస్తున్న మనోహరి కూడా కారు ఆపేస్తుంది. ఏమైందని రామ్మూర్తి అడగ్గానే.. ముందు రాథోడ్ కారు అపేశాడని చెప్తుంది. దీంతో రామ్మూర్తి కారు దిగి ముందుకు వెళ్లి ఏంటి రాథోడ్‌ కారు ఆపావు అని అడుగుతాడు. సార్‌ రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టారు సార్‌ అని రాథోడ్‌ చెప్పగానే.. అందరూ రాళ్లను చూసి షాక్‌ అవుతారు. అటు డైవర్షన్‌ అని బోర్డు పెట్టారు అని చెప్తుంటాడు. దూరంగా నిలబడి చూస్తుంటారు మనోహరి, చంభా. ఇది నీ పనేనా మనోహరి అని చంభా అడగ్గానే.. కాదు నేను ఇక్కడ ఏలా చేస్తాను అని మనోహరి చెప్పగానే.. మరి ఎవరు చేసి ఉంటారు అని చంభా అడుగుతుంది.

రణవీర్‌ చేసి ఉంటాడు అని మనోహరి చెప్తుంది. రణవీరా..? అక్కడ ఇంట్లో ఉన్న రణవీర్‌ ఇక్కడకు వచ్చి ఇలా రాళ్లు ఎలా పెట్టగలడు అని చంభా అనుమానంగా అడుగుతుంది. రణవీర్‌ ఇక్కడకు రాలేదు.. రౌడీలను పురమాయించి ఇక్కడ ఈ పని చేయించి ఉంటాడు అని మనోహరి చెప్పగానే.. ఎందుకు చేయించి ఉంటాడు అని చంభా అడగ్గానే.. వీళ్లను అడవి దారి పట్టించి దారి మర్చిపోయేలా చేస్తే చంపేయడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకే చేసి ఉంటాడు అని మనోహరి చెప్తుంది. మరి ఈ విషయం రణవీర్‌ నీతో చెప్పాడా..? అని చంభా అడగ్గానే.. లేదు.. కానీ రణవీర్‌ ప్లాన్‌ ఇదే.. అని నాకు అర్థం అయింది అంటూ మనోహరి చెప్తుంది. ఇక రామ్మూర్తి ఇప్పుడు ఎలా రాథోడ్‌.. ఏం చేద్దాం.. అని అడగ్గానే.. ఏముంది సార్‌ రాళ్లు తీసేసి ముందుకు వెళ్లడమే.. అని రాథోడ్‌ చెప్పగానే.. రాథోడ్‌ రోడ్డు రిపేరులో ఉందని బోర్డు పెట్టారు కదా..? ఒకవేల ముందుకు వెళ్లినా కూడా వెనక్కి రావాలి కదా అంటుంది మిస్సమ్మ..

Advertisement

దీంతో రాథోడ్‌ మిస్సమ్మ నాకు ఈ రాళ్ల మీద ఆ బోర్డు మీద ఎందుకో డౌటుగా ఉంది అని చెప్పగానే.. మనోహరి దగ్గరకు వచ్చి రాథోడ్‌ నీకెందుకు డౌటు అది గవర్నమెంట్‌ వాళ్లు పెట్టిన బోర్డే కదా..? అని చెప్పగానే.. ఎక్కడుంది మేడం.. గవర్నమెంట్‌ వాళ్లు అయితే రోడ్డు అడ్డుగా ఇలా రాళ్లు పెట్టరు..బారీ కేడ్స్‌ పెడతారు. పైగా ఫారెస్ట్‌ వాళ్ల ఇన్ఫర్మేషన్‌ కూడా ఏమీ లేదు అక్కడ అంటాడు రాథోడ్‌.. దీంతో మనోహరి ఇదేమైనా సిటీనా..? బారికేడ్స్‌ పెట్టడానికి ఇటు సైడు వెళ్లమని బోర్డు పెట్టారు కదా..? అని మనోహరి చెప్పగానే.. అందుకే నాకు డౌటు వస్తుంది. ఆ బోర్డు పెట్టిన వాళ్లు బారికేడ్స్‌ ఎందుకు పెట్టలేదు.. పైగా ఆ రోడ్డు ఫారెస్ట్‌ లోకి వెళ్తుంది అని రాథోడ్‌ చెప్పగానే.. మా ఊరి రోడ్డు గురించి అయితే నాకు తెలుసు కానీ ఈ రోడ్డు గురించి నాకు తెలియదు.. ఈ రోడ్డు గుండా వెళితే మెయిన్‌ రోడ్డుకు వెళ్తామా రాథోడ్ అని రామ్మూర్తి అడుగుతాడు.

ఎందుకు కలవదు.. కచ్చితంగా కలుస్తుంది అనుకుంటా..? అని మనోహరి చెప్పగానే.. ఏంటి మేడం మీరు ఇంతకు ముందే వెళ్లి చూశారా..? అంత కచ్చితంగా చెప్తున్నారు..? అని రాథోడ్‌ అడగ్గానే.. రాతోడ్‌ జనరల్‌గా రోడ్లు రిపేరు చేస్తున్నప్పుడు కొద్ది దూరమే వర్క్‌ నడుస్తుంది. తర్వాత నార్మల్‌ గానే ఉంటుంది కదా..? అంటూ మనోహరి చెప్పగానే.. ఈ డిష్‌కర్షన్‌ అంతా ఎందుకు రాథోడ్‌ ఒకసారి ఆయనకు కాల్‌ చేయ్‌ అని మిస్సమ్మ చెప్పగానే.. రాథోడ్‌ ఫోన్‌ చూసి సిగ్నల్‌ లేదు మిస్సమ్మ అంటాడు. మనం సిటీ దాటి చాలా దూరం వచ్చేశాము సిగ్నల్ ఎలా ఉంటుంది అని చెప్పగానే.. అందరూ కంగారు పడుతుంటారు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×