E-Paper
Advertisement

Uttarakhand Tunnel Accident: ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్ సొరంగంలో పెను ప్రమాదం.. రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీ

Uttarakhand  Tunnel Accident: ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్ సొరంగంలో పెను ప్రమాదం.. రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీ
Advertisement

Uttarakhand Tunnel Accident: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. విష్ణుగడ్-పీపల్‌కోటి ప్రాంతంలో జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన సొరంగంలో అర్ధరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీకొన్నాయి. కార్మికులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఓ రైలు.. మెటీరియల్‌తో వస్తున్న మరో రైలుని ఢీ కొట్టింది.

ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్ సొరంగంలో పెను ప్రమాదం

Advertisement

ఈ ఘటనలో దాదాపు 60 మందికి పైగానే గాయపడినట్టు తెలుస్తోంది. మోనో రైళ్లు ఢీకొన్న సమయంలో ఓ రైలులో 109 మంది వరకు కార్మికులు ఉన్నారు. ఈ ఘటనతో సొరంగం లోపల కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత గట్టిగా కేకలు పెట్టారు. సొరంగం లోపల అంతా చీకటిగా ఉండడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు గందరగోళానికి గురయ్యారు కార్మికులు.

ఈ ఘటనలో 60 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. 10 మందిని గోపేశ్వర్‌లో జిల్లా ఆసుపత్రికి, 17 మందిని పీపల్‌కోటిలోని వివేకానంద ఆసుపత్రికి అంబులెన్సుల్లో తరలించారు. మిగతావారికి టన్నెల్ బయటకు ప్రాథమిక చికిత్స అందించారు అధికారులు. మోనోరైలులో ఒకదాని బ్రేకులు ఫెయిల్ కావడంతో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు ఆ ప్రాంతంలోని అధికారి మీడియాకు తెలిపారు.

Advertisement

ఢీ కొన్న రెండు లోకోమోటివ్ రైళ్లు 

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. పొడవైన సొరంగాల్లో కార్మికులు-మెటీరియల్‌ను తీసుకెళ్లడానికి లోకోమోటివ్ రైళ్లను ఉపయోగిస్తుంటారు.

సిగ్నల్ లోపమో, లేక మరేదైనా కారణమా? అనేది ఇంకా తెలీదు. అలకనంద నదిపై 444 మెగావాట్ల సామర్థ్యంతో విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది నిర్మాణ కంపెనీ. అంతలోనే ఈ ఘటన జరిగింది.

ALSO READ:  జపాన్ ను అధిగమించిన భారత్.. ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థ మనదే

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×