E-Paper
Advertisement

Chennai: ఒక్క ఓటుతో గెలుపు ఎమ్మెల్యే.. హైకోర్టు కీలక ఆదేశాలు, బలపరీక్షకు టీవీకే ఎమ్మెల్యే దూరం

Chennai: ఒక్క ఓటుతో గెలుపు ఎమ్మెల్యే.. హైకోర్టు కీలక ఆదేశాలు, బలపరీక్షకు టీవీకే ఎమ్మెల్యే దూరం
Advertisement

Chennai: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడినా రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతోంది అధికార టీవీకే పార్టీ. తాజాగా హైకోర్టు ఆదేశాలతో టీవీకే పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి బలపరీక్షకు దూరంగా ఉండనున్నారు. దీంతో విజయ్ పార్టీకి ఒక్క ఓటు తగ్గనుంది.

టీవీకే ప్రభుత్వ బల పరీక్షకు మరొక ఎమ్మెల్యే దూరం

Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు డీఎంకె మాజీ డీఎంకే మంత్రి కేఆర్ పెరియకరుప్పన్. ఈ వ్యవహారంపై ఆయన హైకోర్టు తలుపు తట్టారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

తాను పోటీ చేసిన శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గానికి చెందిన ఒక పోస్టల్ బ్యాలెట్‌ను పొరపాటున తిరుపత్తూరు జిల్లాకు పంపారని అందులో పేర్కొన్నారు. ఆ బ్యాలెట్ ఏ నియోజకవర్గానికి చెందినదో ఆ ప్రాంతానికి పంపకుండా తిరుపత్తూరు రిటర్నింగ్ అధికారి దానిని తిరస్కరించారని వివరించారు.

Advertisement

ఒక్క ఓటుతో గెలుపు ఎమ్మెల్యే వ్యవహారం.. మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు

ఈ నేపథ్యంలో శ్రీనివాస సేతుపతి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండా నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయాలని కోర్టును కోరారు.  దీనిపై వాదోపవాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అసెంబ్లీ కార్యకలాపాలు, బలపరీక్ష ఓటింగ్‌లో సేతుపతి దూరంగా ఉండాలని ఆదేశించింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి బ్యాలెట్‌ను బదిలీ చేయడానికి ఈసీకి అనుమతి ఉండదని సమాచారం. ఫలితాలు వెలువడిన నుంచి కమిషన్ పదవిలో ఉండదని ఈసీ వాదించినట్టు తెలుస్తోంది. ఎన్నికల పిటిషన్ ద్వారా ఉపశమనం కోరవచ్చని, ఆ గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ఉపశమనం కల్పించలేమని చెప్పినట్టు సమాచారం.

ALSO READ: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. మీ పాన్ కార్డులో ఆ వివరాలు ఉంటే ఇక సబ్సిడీ రానట్టే!  

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×