E-Paper
Advertisement

Madhya Pradesh : మూత్ర విసర్జన ఘటన.. బాధితుడి కాళ్లు కడిగిన సీఎం..

Madhya Pradesh : మూత్ర విసర్జన ఘటన.. బాధితుడి కాళ్లు కడిగిన సీఎం..
Advertisement

Madhya Pradesh urination case(Latest breaking news in telugu): మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటన తీవ్ర దుమారం రేపింది. సిధి జిల్లాలో రోజువారీ కూలీగా పని చేస్తున్న దశమత్ రావత్‌ అనే వ్యక్తిపై నిందితుడు ప్రవేశ్ శుక్లా మూత్రం పోశాడు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు. నిందితుడు ప్రవేశ్‌ శుక్లాను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.

తాజాగా మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సన్మానించారు.భోపాల్‌లోని తన నివాసంలో దశమత్ రావత్ కాళ్లు కడిగి, సాలువా కప్పి సత్కరించారు. అతడిని కుర్చీలో కూర్చొబెట్టి సీఎం కింద కూర్చున్నారు. రావత్ రెండు కాళ్లను ప్లేట్‌లో ఉంచి పాదాలను నీళ్లతో కడిగారు . అతనికి బొట్టు పెట్టి పూలమాల వేశారు. శాలువ కప్పి సన్మానం చేశారు.

Advertisement

మూత్ర విసర్జన ఘటన విషయం తెలియగానే సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. యూపీలో యోగీ ఆదిత్య నాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ సర్కార్ కూడా అమలు చేసింది. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లా ఇంటిని అధికారులు కూల్చి వేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×