E-Paper
Advertisement

YS Sharmila : కోటలు కట్టుకుని.. ప్రజలకు దూరంగా.. జగన్ పై షర్మిల సెటైర్లు..

YS Sharmila : కోటలు కట్టుకుని.. ప్రజలకు దూరంగా.. జగన్ పై షర్మిల సెటైర్లు..
Advertisement

YS Sharmila : నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లడం వైఎస్‌ఆర్‌ మార్క్‌ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కడపలో కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె వైసీపీ ప్రభుత్వం విధానాలపై నిప్పులు చెరిగారు. ఆరోగ్య శ్రీ, 108.. ఇవన్నీ వైఎస్‌ఆర్‌ మార్క్‌ పథకాలు అని పేర్కొన్నారు.

చేసిన మేలు గుర్తు పెట్టుకోవడం వైఎస్‌ఆర్‌ మార్క్‌ అని షర్మిల స్పష్టంచేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం వైఎస్‌ఆర్‌ మార్క్‌ అని అన్నారు. ఇప్పటి పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నారని జగన్ ను ఉద్దేశించి సైటర్లు వేశారు.

Advertisement

వైఎస్‌ఆర్‌ బతికుంటే.. కడప జిల్లాకు ఇంకా ఎంతో చేసేవారని తెలిపారు. వైఎస్‌ఆర్‌ బతికుంటే కడపకు స్టీల్‌ ఫ్యాక్టరీ వచ్చేదన్నారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ఏపీ విభజన హామీల్లో ఒకటని గుర్తు చేశారు. కనీసం కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కూడా జగన్‌ తెచ్చుకోలేకపోయారని షర్మిల విమర్శలు గుప్పించారు.

జగన్‌ సీఎం పదవి చేపట్టాక మారిపోయారని ‌ షర్మిల అన్నారు. గతంలో వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే.. ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎప్పుడూ పదవీ కాంక్ష లేదన్నారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తనపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తనపై వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీతో తన భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని ఆరోపిస్తున్నారన్నారు. జగన్‌ను జైల్లో పెట్టి తాను సీఎం కావాలని బ్రదర్ అనిల్ కోరారని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అదంతా అబద్ధమన్నారు.

సోనియా గాంధీ దగ్గరికి భారతి రెడ్డితో కలిసే బ్రదర్ అనిల్ వెళ్లేవారని షర్మిల స్పష్టంచేశారు. వైసీపీ నేతలు ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్‌ పత్రికలో తనపై వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఆ పత్రికలో జగన్‌కు ఎంత భాగస్వామ్యం ఉందో తనకు అంతే ఉందని స్పష్టంచేశారు. ఆ విషయం మరిచి ఆ పత్రికలో ఇష్టానుసారం వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×