E-Paper
Advertisement

Jagan: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోయే కాలం మనదే: జగన్

Jagan: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోయే కాలం మనదే: జగన్
Advertisement

Jagan Mohan Reddy latest news(Political news in AP): ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోయే కాలం మనదే.. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందామంటూ కార్యకర్తలకు, నాయకులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన ఆయన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

‘మన ప్రభుత్వ హయాంలో చెప్పినవన్నీ చేశాం. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది.. ఎప్పటికీ ఉంటది. అందుకే ప్రజలకు మన పైనే విశ్వాసం ఉంది. భవిష్యత్ మనదే. ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం మన పార్టీ శ్రేణులు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయి’ అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Advertisement

అదేవిధంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా ఆయన చర్చించారు. ‘నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడొద్దు. పార్టీ అండంగా ఉంటుంది. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు పార్టీ తోడుగా ఉంటుంది. అదేవిధంగా కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలి’ అంటూ ప్రజాప్రతినిధులకు జగన్ సూచించారు.

పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. మూడు రోజులపాటు భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులతో జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి కష్టాసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Also Read: జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా? గాలితో మంతనాలు?

ఇదిలా ఉంటే.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా పులివెందులకు వెళ్లడంపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు 11 స్థానాల్లో అవకాశం కల్పించినా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరపరుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×