E-Paper
Advertisement

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు
Advertisement

TTD: తిరుమల పుణ్యక్షేత్రంలో ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. పురాణాల ప్రస్తావన, వేద పండితుల సూచనల మేరకు ఈ పది రోజులూ అత్యంత పవిత్రమైనవని, ఏ రోజు స్వామివారిని దర్శించుకున్నా సమానమైన ఫలితం లభిస్తుందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, రద్దీని క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా పాలకమండలి పకడ్బందీ చర్యలు చేపట్టింది.

ఈసారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం తొలిసారిగా ‘ఈ-డిప్’ (ఎలక్ట్రానిక్ డిప్) విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. అత్యంత పారదర్శకతతో కూడిన ఈ ప్రక్రియ ద్వారా మొదటి మూడు రోజులకు గాను దేశవ్యాప్తంగా సుమారు 1,89,000 మంది భక్తులకు టోకెన్లను జారీ చేశారు. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన నిర్దేశిత సమయానికి తిరుమలకు చేరుకుంటే, కేవలం రెండు గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం పూర్తయ్యేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.

Advertisement

భక్తుల రాకను క్రమబద్ధీకరించడానికి మూడు ప్రత్యేక ప్రవేశ మార్గాలను సిద్ధం చేశారు. కేటాయించిన సమయానికి వచ్చే భక్తులను నేరుగా క్యూలైన్‌లకు దగ్గరగా ఉన్న మార్గం ద్వారా పంపిస్తారు. ఒకవేళ నిర్ణీత సమయం కంటే ముందుగా వచ్చే వారి కోసం మరో రెండు ప్రవేశ మార్గాలను కేటాయించారు. వీరిని ముందుగా క్యూలైన్‌లోకి అనుమతించినప్పటికీ, వారికి కేటాయించిన స్లాట్ సమయంలోనే దర్శనం లభించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఏకాదశికి ముందు రోజైన 29వ తేదీన పరిమిత సంఖ్యలో టికెట్లు ఇచ్చి, అదే రోజు దర్శనాలు పూర్తయ్యేలా చూస్తున్నారు.

జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15,000 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 1,500 శ్రీవాణి టికెట్లను జారీ చేసినట్లు ఈవో వెల్లడించారు. వీటితో పాటు సుమారు 3,60,000 మంది భక్తులు సర్వదర్శనం పొందేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆధునిక సాంకేతికతను జోడిస్తూ ‘ఏఐ (AI) ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ ద్వారా ప్రతి రెండు గంటలకు ఒకసారి రద్దీ స్థితిగతులను భక్తులకు తెలియజేస్తారు. దీనివల్ల భక్తులు రద్దీ తక్కువగా ఉన్న సమయంలో దర్శనానికి వచ్చే అవకాశం కలుగుతుంది.

Advertisement

Also Read: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అంబులెన్స్, కారు ఢీ.. స్పాట్‌లో ఆరుగురు!

ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని టీటీడీ భావిస్తోంది. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, పాలు వంటి మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా లోటు రాకుండా వందలాది మంది శ్రీవారి సేవకులను, సిబ్బందిని నియమించారు. మొత్తానికి ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతినిచ్చేలా టీటీడీ సన్నద్ధమైంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×