E-Paper
Advertisement

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్
Advertisement

Tirupati Laddu Controversy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అజయ్‌కుమార్ సుగంధ్‌ను సిట్ అరెస్టు చేసింది. ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. నవంబర్‌ 21 వరకు రిమాండ్ విధించింది.

సిట్ దర్యాప్తులో.. అజయ్‌కుమార్ సుగంధ్‌ గత ఏడు సంవత్సరాలుగా బోలే బాబా కంపెనీకి మోన్ గ్రీజరాయిడ్స్‌, అసటిక్ యాసిడ్‌ యాస్టర్‌ వంటి కెమికల్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ఈ కెమికల్స్‌ను పామాయిల్ తయారీ ప్రక్రియలో వాడుతూ, ఆ పామాయిల్‌ను లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిగా సరఫరా చేసినట్టు విచారణలో వెల్లడైంది.

Advertisement

సిట్ అధికారులు తెలిపిన ప్రకారం.. లడ్డూలలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతానికి పైగా పామాయిల్ కల్తీ ఉన్నట్టు ల్యాబ్‌ పరీక్షల్లో తేలింది.

సిట్‌ ఇప్పటికే బోలే బాబా కంపెనీ యజమాని, మేనేజ్‌మెంట్ సిబ్బందితో పాటు పలు సరఫరాదారులను విచారించింది. నెయ్యి సరఫరా వ్యవస్థలో అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యమైన డెయిరీ నెయ్యి బదులుగా చౌక పామాయిల్ కలిపిన కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా కోట్ల రూపాయల మోసం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

దర్యాప్తు బృందం ఇప్పటికే బోలే బాబా కంపెనీ గోదాములు, రసాయనాల నిల్వ కేంద్రాలు, సరఫరా రికార్డులను పరిశీలించింది. ఆ రికార్డుల ద్వారా అజయ్‌కుమార్ సుగంధ్‌ పామాయిల్ ఉత్పత్తికి అవసరమైన కెమికల్స్‌ను విస్తృత స్థాయిలో అందజేశారని నిర్ధారించారు. విచారణలో ఆయన వందల లీటర్ల రసాయనాలను సరఫరా చేసినట్లు అంగీకరించినట్టు సమాచారం.

సిట్ అధికారులు పేర్కొన్నట్లుగా, ఈ కల్తీ చర్యలు కేవలం ఆర్థిక మోసం మాత్రమే కాకుండా.. భక్తుల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమని తెలిపారు. మోన్ గ్రీజరాయిడ్స్‌, అసటిక్ యాసిడ్‌ యాస్టర్‌ వంటి కెమికల్స్‌ అధిక మోతాదులో వాడితే లివర్‌, హృదయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

ఇక సిట్‌ దృష్టి ఇప్పుడు ఈ కల్తీ వ్యవస్థ వెనుక ఉన్న పెద్ద వ్యాపార వలయంపై కేంద్రీకృతమవుతోంది. అజయ్‌కుమార్‌ ఇచ్చిన వివరాల ఆధారంగా మరికొన్ని కంపెనీలు, మధ్యవర్తులు, రసాయన సరఫరాదారులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సమాచారం.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×