E-Paper
Advertisement

TTD : టీటీడీ కీలక నిర్ణయం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం..

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలియజేసింది. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం వివరాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు.

TTD : టీటీడీ కీలక నిర్ణయం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం..
Advertisement
AP updates

TTD latest news today(AP updates):

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలియజేసింది. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం వివరాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు.

మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అదే తరహాలో లక్ష్మీ కాసులను కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంది. టీటీడీ దేవస్థానం పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించి.. వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు నిర్ణయించింది.

Advertisement

టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు ఉన్నాయి. దేవస్థానం పరిధిలో 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాశారు. గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు కేటాయించారు. నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయిస్తూ టీటీడీ ఆమోద ముద్ర వేసింది. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించింది.

టీటీడీ దేవస్థానం హుండి ద్వారా 1611 కోట్లు వస్తోందని టీటీడీ పాలక మండలి అంచనా వేసింది. దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లను అంచనా వేసింది. జీతాలు చెల్లింపుకు 1.733 కోట్లు,కార్పస్ ఫండ్‌కుకి 750 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×