E-Paper
Advertisement

Kethireddy: జగన్ సీఎంవో తీరుపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kethireddy: జగన్ సీఎంవో తీరుపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Former Mla Kethireddy: జగన్ సీఎంవో తీరుపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పాలనలోని సీఎంవో తీరుపై పలు ఆరోపణలు చేశారు. సీఎంవో కార్యాలయంలో పనిచేసే అధికారుల ప్రవర్తన తీరువల్ల నియోజకవర్గ సమస్యలను నేరుగా జగన్‌కు చెప్పుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యాలయ వ్యవహార తీరుపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పెదవి విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి కూడా పీఎంవో తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు.. వెళితే సీఎంవో తీరుతో సీఎంను కలిసేందుకు వీలు అయ్యేది కాదని ఆరోపించారు. వారి ప్రవర్తన వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇబ్బంది పడ్డారని, గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు.

Advertisement

Also Read: వైసీపీ ఓటమికి కారణం.. తిలా పాపం తలా పిడికెడు

ధర్మవరం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణకు అవసరమయ్యే డబ్బుల కోసం వందసార్లు సీఎం కార్యాలయం చుట్టూ తిరిగానని అన్నారు. రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం వల్లే అత్యధిక స్థానాల్లో గెలుపొందిందని వెల్లడించారు. వైసీపీ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామని భరోసా ఇస్తే ఫలితాలు సానుకూలంగా ఉండేవని అన్నారు. ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయని పేర్కొన్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×