E-Paper
Advertisement

Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..

Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..
Advertisement

Sajjala : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన గర్జన రోజునే పవన్‌ అక్కడికి వచ్చి ఉద్దేశపూర్వంగానే రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.

Advertisement

ఇప్పటం గ్రామంలో జరిగిన ఘటనపై టీడీపీ, జనసేన రాద్దాంతం చేస్తున్నాయని సజ్జల ఆరోపించారు. ప్రభుత్వం ఆక్రమణలను కూల్చాలా..? వద్దా..? అని ప్రశ్నించారు. ఏం జరగకపోయినా సినిమా స్క్రిప్ట్‌ రాస్తున్నారని ఆరోపించారు. ఇప్పటంలో పవన్‌ అంత ఆవేశం ఎందుకు ప్రదర్శించారో అర్థం కావడంలేదన్నారు. ఇప్పటంలో గోడ కూడా కూల్చలేదని స్పష్టం చేశారు. అయినా సరే రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబుపైనా సజ్జల విమర్శలు గుప్పించారు. నందిగామలో రాయితో దాడిచేశారని చంద్రబాబు డ్రామా చేశారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బాబు మాయాబజార్‌ చూపించారని విమర్శించారు. చంద్రబాబు పాలనంతా కరువే ఉందన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×