E-Paper
Advertisement

Saikrishna lock-up death case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. దర్యాప్తు స్పీడ్ పెంచిన సిట్, కానిస్టేబుల్ అరెస్ట్

Saikrishna lock-up death case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. దర్యాప్తు స్పీడ్ పెంచిన సిట్, కానిస్టేబుల్ అరెస్ట్
Advertisement

Saikrishna lock-up death case: ఏపీలో సంచలనం రేపిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుడు అరెస్టు కావడంతో మిగతా వారిపై ఫోకస్ చేసింది సిట్. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు అధికారులు. ఇంకా ఎంతమంది పోలీసులు ప్రమేయం ఉందనేది ఆసక్తికరంగా మారింది.

విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు స్పీడ్

Advertisement

ఏపీలో సంచలనంగా మారిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది సిట్. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. ఆపై రిమాండ్‌కు తరలించారు. ఇదిలాఉండగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు సిట్ అధికారులు.

పోలీసుల థర్డ్ డిగ్రీ వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోపణలు నిజమని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు విచారించారు. ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరు పరిచారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి కోరే అవకాశం ఉంది. లాకప్‌లో సాయికృష్ణపై జరిగిన థర్డ్ డిగ్రీ జరగడం వెనుక బాబురావు కీలక పాత్ర పోషించినట్లు గట్టి ఆధారాలు సేకరించింది సిట్.

Advertisement

కానిస్టేబుల్ బాబురావుని అరెస్ట్ చేసిన అధికారులు, మరో కొందరు కూడా

సాయికృష్ణను విచక్షణారహితంగా కొట్టడంతో మరణించాడని సిట్ నిర్ధారణకు వచ్చింది. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని గతంలో పోలీసులను ఆదేశించిన విషయం తెల్సిందే.

ఈలోగా ప్రభుత్వం సిట్ వేయడంతో దర్యాప్తులో పోలీసులు సాయికృష్ణను కొట్టి చంపిన విషయం బయటపడింది. అప్పటివరకు మిస్సింగ్ కేసు‌గా ఉన్న ఈ కేసు లాకప్ డెత్‌గా మారింది. మరోవైపు ఈ కేసులో మరికొందరు అరెస్టు కావచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నారు. ఒకరు లేదా ఇద్దరు పోలీసులు ఉండే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

ALSO READ: అక్కడ వచ్చింది గొడ్డలి ఫ్యాక్టరీలే.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై భూమిరెడ్డి హాట్ కామెంట్స్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×