E-Paper
Advertisement

Roja on Tirumala Laddu Issue: జగన్ కాళ్లు కడిగి.. ఆ నీళ్లను పవన్ తన నెత్తిన చల్లుకోవాలి.. రోజా ఫైర్

Roja on Tirumala Laddu Issue: జగన్ కాళ్లు కడిగి.. ఆ నీళ్లను పవన్ తన నెత్తిన చల్లుకోవాలి.. రోజా ఫైర్
Advertisement

Roja on Tirumala Laddu Issue: చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి ఆర్.కె. రోజా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ అంశంపై సీబీఐ సమర్పించిన నివేదికను ఉటంకిస్తూ.. ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై రోజా స్పందిస్తూ.. సీబీఐ ఇచ్చిన నివేదిక విమర్శకుల చెంపదెబ్బ వంటిదని అభివర్ణించారు. 310 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన తిరుమల ప్రసాదంపై అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. ఐసీఏఆర్ , జాతీయ పరిశోధన సంస్థల పర్యవేక్షణలో జరిగిన పరీక్షల్లో నెయ్యిలో పంది కొవ్వు గానీ, చేప నూనె గానీ లేవని తేలిందని ఆమె పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారి ప్రతిష్టను దిగజార్చేలా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.

Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రోజా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ కోసమే డ్రామాలు చేస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్‌లో నడిచే ఓ రాజకీయ నటుడని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని విజయవాడ వరదల నుండి మళ్లించడానికే ఈ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ (SIT) ద్వారా విచారణ జరిపి ఉంటే నిజాలు బయటకు వచ్చేవి కావు కాబట్టే, న్యాయ పర్యవేక్షణలో జరిగిన విచారణలో నిజం వెల్లడైందని ఆమె అన్నారు.

అసత్య ఆరోపణలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు పాలకులందరూ నైతికంగా రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. భక్తులందరూ వీరిని నిలదీయాలని, ప్రధాని మోదీ ఈ విషయంలో తక్షణమే స్పందించాలని కోరారు. దేవుడిపై విషం చిమ్మిన వీరికి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి శిక్షించాలని అన్నారు. గతంలో ఎన్టీఆర్‌పై కూడా ఇలాగే విషప్రచారం చేశారని గుర్తు చేస్తూ.. ఇప్పుడు లడ్డూను రాజకీయం చేస్తున్న వీరిని ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు.

Advertisement

ALSO READ:ఏసీబీలోనే ఉంటూ.. ఏసీబీకే కన్నం వేసిన ‘కిలాడీ’ హోంగార్డు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×