E-Paper
Advertisement

Tirumala temple news : చిన్నారులకు ట్యాగ్స్.. తిరుమల నడకమార్గంలో ఆంక్షలు..

Tirumala temple news :  చిన్నారులకు ట్యాగ్స్.. తిరుమల నడకమార్గంలో ఆంక్షలు..
Advertisement
Tirupati latest news today

Tirupati latest news today(Andhra news updates):

చిన్నారి లక్షితపై చిరుత దాడి తర్వాత టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నడక దారిలో ఇకపై చిన్నారులను తీసుకెళ్లడంపై ఆంక్షలు విధించింది. ఆరేళ్ల చిన్నారి లక్షితపై అత్యంత దారుణంగా చిరుత దాడి చేసి చంపిన తర్వాత టీటీడీ అధికారులు కొత్త ఆంక్షలను విధించారు. తిరుమలకు నడక మార్గాల్లో వచ్చే చిన్నారుల భద్రతపై దృష్టి సారించారు.

ఇకపై నడక మార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లమార్గంలో ఈ ఆంక్షలను అమలు చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరిస్తామన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతిస్తామని తెలిపారు.

Advertisement

ఏడో మైలు వద్ద చిన్నారుల చేతికి ట్యాగులు వేస్తున్నారు. చిన్న పిల్లలు తప్పిపోయినా, అనుకోని ఘటనలు జరిగినా వారిని గుర్తించేందుకు ఈ ట్యాగులు ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ట్యాగ్స్ పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్, టోల్‌ ఫ్రీ నంబర్‌ నమోదు చేస్తున్నారు. అలిపిరి–తిరుమల మార్గంలో వంద మంది భక్తులను గుంపుగా పంపుతున్నారు. ముందు , వెనుక రోప్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులను వారికి రక్షణగా పంపుతున్నారు. అదే సమయంలో రెండో ఘాట్‌ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లకు నో ఎంట్రీ అని స్పష్టం చేశారు.

మరోవైపు చిన్నారిపై దాడి చేసిన చిరుతను బంధించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతల సంచారంపై నిఘా పెట్టారు. ఇందుకోసం టీమ్‌లను ఏర్పాటు చేశారు. నడకమార్గం పరిధిలో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×