E-Paper
Advertisement

Investment In Ap: ఏపీలో మరో పెద్ద పెట్టుబడి.. గూగుల్ తర్వాత ఆ కంపెనీదే, మంత్రి లోకేష్ ప్రకటన

Investment In Ap: ఏపీలో మరో పెద్ద పెట్టుబడి.. గూగుల్ తర్వాత ఆ కంపెనీదే, మంత్రి లోకేష్ ప్రకటన
Advertisement

Investment In Ap: ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఒకవైపు.. మరోవైపు మంత్రి లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఏడాదిలోపు మాగ్జిమమ్ పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రూ. 82 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.

ఏపీలో భారీ పెట్టుబడి

Advertisement

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రాబోతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. రీన్యూ పవర్ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ కంపెనీ పెట్టుబడులు పెడుతోందన్నారు.

పునరుత్పత్తి విద్యుత్ రంగంలో భారీ ప్రాజెక్టులను రీ న్యూ పవర్ కంపెనీ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. భారీ పెట్టుబడితో రీన్యూ పవర్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనుంది. సోలార్ ఇంగాట్ , వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్, మాలిక్యూల్స్ ఉత్పత్తి వంటి రంగాల్లో పూర్తి స్థాయి పెట్టుబడులు పెట్టడం గర్వంగా ఉందని రాసుకొచ్చారు.

Advertisement

గూగుల్ తర్వాత ఆ కంపెనీదే

ఈ కంపెనీ ఏపీకి రావడం వెనుక మంత్రి లోకేష్ చేసిన కృషి అంతా ఇంతా కాదని అంటున్నారు. గూగుల్ తర్వాత ఆ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న రెండో కంపెనీగా టీడీపీ నేతలు చెబుతున్నారు. గూగుల్ 87 వేల కోట్లు పైచిలుకు కాగా, రి న్యూ పవర్ రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.

క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ, తయారీ రంగాలలో ఒక ట్రిలియన్ డాలర్లు పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుందని బుధవారం ఢిల్లీలో ఓ బిజినెస్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు మంత్రి వెల్లడించారు. దీన్ని డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు ప్రభుత్వం అని వర్ణించారు. గూగుల్ మొదలు క్వాంటం కంప్యూటింగ్ వరకు అన్ని రంగాలలో ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు.

ALSO READ:  విశాఖలో నాలుగు ఐటీ కంపెనీలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

ఏపీ అభివృద్ధికి మూడు అంశాలు కారణమని అందులో ప్రస్తావించారు. సరైన నాయకత్వం, ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు వంటివి ప్రధానమని తెలిపారు. రాష్ట్రం కొత్త LIFT పాలసీని రూపొందించింది, ఫార్చ్యూన్-500 కంపెనీలకు పోటీ ధరలకు భూమిని అందిస్తుందన్నారు. ఇప్పటికే TCS, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు ఇచ్చినట్టు తెలిపారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×