E-Paper
Advertisement

Fake Reporter: ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. ఫేక్ రిపోర్టర్ అరెస్ట్..

Fake Reporter: ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. ఫేక్ రిపోర్టర్ అరెస్ట్..
Advertisement
fake reporter

Fake Reporter: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశాడో యుట్యూబర్‌. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ సూర్యారావు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేకల భాను అనే యుట్యూబర్‌ ను అరెస్టు చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం భానుకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

మేకల భాను.. ప్రజాకోర్టు పేరుతో యూ ట్యూబ్‌ ఛానల్‌ ఏర్పాటు చేశాడు. తానో జర్నలిస్ట్‌ అని చెప్పకుంటూ పలువురిని బ్లాక్‌ మెయిల్‌ చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. గతంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ భర్తతో మేకల భానుకు వివాదం ఉంది. తనను బెదిరించానంటూ పెట్రోల్‌ బాటిల్‌ తో పీఎస్‌ ముందు బైఠాయించాడు. అప్పుడు పోలీసులు భానును.. అదుపులోకి తీసుకుని వదిలేశాడు. ఇదే విషయంలో తన బంధువులను బ్లాక్‌ మెయిల్‌ చేశాడంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఎంపీపీ భర్త దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు చేశాడు.

Advertisement

మేకల భానుపై పలు పోలీస్‌ స్టేషన్లలో దాదాపుగా 9కి పైగా కేసులు ఉన్నాయి. భాను బాధితులు మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఇటీవల వాట్సప్‌ గ్రూప్‌ లు విపరీతంగా పెరిగాయని.. జర్నలిస్టులమని మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×