E-Paper
Advertisement

Nara Bhuvaneshwari : ‘నిజం గెలవాలి’ యాత్ర.. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..

Nara Bhuvaneshwari : ‘నిజం గెలవాలి’ యాత్ర.. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..
Advertisement

Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర మంగళవారం బాపట్ల జిల్లాలో కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. తొలుత కొల్లూరు మండలం చిలుమూరులో రామలింగేశ్వరస్వామి దేవస్థానం సందర్శించారు. వేణుగోపాల స్వామి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టిప్రోలు మీదుగా చెరుకుపల్లి మండలం చేరుకుని వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.

వెంకటేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటామని భువనేశ్వరి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందించారు. స్థానికంగా ఉన్న మహిళలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్సీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×