E-Paper
Advertisement

AvinashReddy: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐకి సహకరిస్తా: అవినాశ్ రెడ్డి

AvinashReddy: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐకి సహకరిస్తా: అవినాశ్ రెడ్డి
Advertisement

AvinashReddy: ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఉత్కంఠ రేపింది. సాక్షిగా పిలిచారా? నిందితుడిగా రమ్మన్నారా? అంటూ ఊహాగానాలు వచ్చాయి. చివరాఖరికి సాక్షిగానే పిలిచారని తెలిసింది. హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో 4 గంటల పాటు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు.

కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, నిందితుడు దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగా ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి పలు వివరాలు రాబట్టింది. వివేకా హత్య సమయంలో ఎక్కడ ఉన్నారు? డెడ్ బాడీని ఎప్పుడు చూశారు? చూడగానే ఏం చేశారు? గుండెపోటు అని ఎందుకు చెప్పారు? వివేకాతో ఎలాంటి సంబంధం ఉండేది? దస్తగిరి తెలుసా? నిందితులు మీ పేరును ఎందుకు ప్రస్తావించారు? ఇలా రకరకాల ప్రశ్నలతో అవినాశ్ రెడ్డి నుంచి సమాచారం సేకరించారని తెలుస్తోంది.

Advertisement

విచారణ ముగిశాక ఎంపీ అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీబీఐ అడిగిన వివరాలు చెప్పానని.. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన సమాచారం ఇచ్చానని అన్నారు. అవసరమైతే మళ్లీ పిలుస్తాం అన్నారని.. ఎప్పుడు పిలిచినా సీబీఐకి సహకరిస్తానని అవినాశ్ రెడ్డి చెప్పారు.

అంతకుముందు, విచారణలో తనతో పాటు లాయర్లను అనుమతించాలని.. ఎంక్వైరీని వీడియో, ఆడియో రికార్డ్ చేయాలంటూ సీబీఐకి లేఖ రాశారు అవినాశ్ రెడ్డి. అయితే, అలా కుదరదని.. అందుకు అనుమతించలేమని సీబీఐ అధికారులు తేల్చి చెప్పడంతో అవినాశ్ రెడ్డిని సింగిల్ గానే ప్రశ్నించారు సీబీఐ ఆఫీసర్స్.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×