E-Paper
Advertisement

KTR: అదానీ పాపం ఎవరిది? కేంద్రానికి కేటీఆర్ క్వశ్చన్స్..

KTR: అదానీ పాపం ఎవరిది? కేంద్రానికి కేటీఆర్ క్వశ్చన్స్..
Advertisement

KTR: అదానీ. ఈ పేరు మళ్లీ మారుమోగిపోతోంది. గతంలో సంపాదనలో అదానీ గ్రూప్ పేరు వినిపిస్తే.. ఈసారి పతనంలో అదానీ స్టాక్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కంపెనీ విలువను ఎక్కువ చేసి చూపించారని.. లెక్కలు సరిగా లేవని.. షేర్లు తాకట్టు పెట్టి భారీ మొత్తంలో అప్పులు చేశారంటూ.. పూర్తి రీసెర్చ్ తో సమగ్రమైన రిపోర్ట్ వెలువడించింది హిండెన్‌బర్గ్‌. ఆ నివేదికే ఇప్పుడు దేశంలో ప్రకంపనలు రేపుతోంది.

వరుసగా రెండు మార్కెట్ సెషన్లలో అదానీ గ్రూపునకు చెందిన 10 స్టాక్స్ భారీగా ఫాల్ అయ్యాయి. రెండు రోజుల్లో 5 లక్షల మార్కెట్ షేర్ కోల్పోయింది అదానీ. ఇకముందూ మరింత పతనమవుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Advertisement

అదానీ గ్రూప్ స్టాక్స్ తో పాటు ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ షేర్లు కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. ఈ రెండు షేర్లు కూడా సుమారు 5 శాతం పడిపోయాయి. ఎందుకు? అదానీకి ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ కి ఏంటి లింకు? అంటే…

అదానీ స్టాక్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టాయి ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి కారణమవుతోంది. అదానీ గ్రూపులో అంత పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్న. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ రెండూ ప్రభుత్వ రంగ కంపెనీలు కాబట్టి.. వాటితో ఎవరైనా బలవంతంగా అంతమొత్తం పెట్టుబడి పెట్టించారా? అనే అనుమానం. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Advertisement

అదానీ గ్రూప్‌ స్టాక్‌ల్లో ఎల్‌ఐసీ 77 వేల కోట్లు, ఎస్‌బీఐ 80 వేల కోట్లు పెట్టుబడి ఎందుకు పెట్టాయి? ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలను అలా నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారంలో అదానీకి ఎవరు సహాయం చేశారు? అంటూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా ప్రశ్నలు సంధించారు కేటీఆర్.

అటు, అన్నలానే చెల్లి సైతం అదానీ విషయంలో ట్విట్టర్లో కేంద్రాన్ని నిలదీశారు. ఈ పరిణామాలపై ప్రతీ ఒక్క భారతీయుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×