E-Paper
Advertisement

Kolusu Parthasarathy : తిట్టకపోతే సీటివ్వరా..? వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే పార్థసారథి విమర్శలు

Kolusu Parthasarathy : తిట్టకపోతే సీటివ్వరా..? వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే పార్థసారథి విమర్శలు
Advertisement

Kolusu Parthasarathy : ఏపీలో మరో రెండు నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయపార్టీలు అభ్యర్థుల ఎంపికలపై కసరత్తులు చేస్తున్నాయి. వైసీపీ నుంచి మూడు లిస్టులు రాగా.. సిట్టింగులకు ఊహించని షాకులే తగిలాయి. ఇప్పటికే ఆ పార్టీలో అసంతృప్తులు పెరిగాయి. కీలక నేతలకు సీటివ్వకుండా మొండిచేయి చూపడంతో.. సీటు ఆశించిన వారితో పాటు.. వారి అనుచరులు వైసీపీపై గుర్రుగా ఉన్నారు. కొందరు పార్టీ మారే ఆలోచనలో పడ్డారు.

తాజాగా విడుదలైన లిస్టులో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి (kolusu parthasarathy) కి కూడా సీటు లేదని చెప్పకనే చెప్పింది. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగిరమేశ్ (Jogi Ramesh) ను నియమించింది అధిష్టానం. ఈ క్రమంలో కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? అని ప్రశ్నించారు.

Advertisement

వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడమంటే.. నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా ఉంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు. పార్టీలో బలహీనవర్గాలకు గుర్తింపు ఉంటుందని గతంలో తానే చెప్పానని, అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదన్నారు. బీసీ, ఎస్సీలు ఎవరికాళ్లపై వారు నిలబడాలని అనుకుంటారని, మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే నాలా ఆత్మాభిమానాన్ని చంపుకోరని ఆయన వ్యాఖ్యలు చేశారు.

కాగా.. అధికార వైసీపీకి మరో షాక్ తగలనుంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి సాయంత్రం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ నెల 21న ఆయన టీడీపీ(TDP) లో చేరనున్నారు. పార్థసారథిని ఆపడం కోసం వైసీపీ చివరి వరకు ప్రయత్నించినా.. అవేవీ ఫలించలేదు. ప్రయత్నాలు బెడిసికొట్టడంతోనే పెనమలూరుకు జోగి రమేష్ ను ఇంచార్జ్ గా నియమించింది. దీంతో ఇక పార్టీలో ఉండేది లేదని పార్థసారథి నిర్ణయించుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×