E-Paper
Advertisement

జేసీని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించండి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

జేసీని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించండి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Ketireddy Peddareddy: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య సవాల్-ప్రతిసవాల్ల పర్వం మరోసారి హీటెక్కింది. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిపై, స్థానిక పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

శాంతియుత దీక్షకు భగ్నం – పోలీసుల పక్షపాతం

Advertisement

తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా దీక్ష చేపట్టేందుకు తాము అనుమతి కోరినప్పటికీ, పోలీసులు నిరాకరించడంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. పోలీసుల ఆంక్షల కారణంగానే తాను ఇంటి వద్దే దీక్ష చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తనకు నిరసన తెలపడానికి అనుమతి ఇవ్వకపోవడంతోనే ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ నాయకులు ఇస్తున్న ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం లేదని, కానీ వైసీపీ వారిపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షన్ సంస్కృతి

Advertisement

జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాడిపత్రిలో మళ్లీ ఫ్యాక్షన్ చేస్తానంటూ రౌడీయిజానికి దిగుతున్నారని పెద్దారెడ్డి విమర్శించారు. వ్యక్తిగత దూషణలు చేయడం దుర్మార్గపు చర్య అని, జిల్లాలోని అందరూ తనలాగే దౌర్జన్యంగా వ్యవహరించాలని జేసీ ఆకాంక్షిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎప్పుడూ దౌర్జన్యం చేస్తామని చెప్పలేదని, జేసీ ప్రభాకర్ రెడ్డే అనవసరంగా రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ‘జేసీ చేస్తున్న ఈ దౌర్జన్యాలన్నీ సీఎం చంద్రబాబు, లోకేష్‌ల అనుమతితోనే జరుగుతున్నాయా?’ అని పెద్దారెడ్డి ప్రశ్నించారు.

Also Read: ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా.. కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీలో దుస్థితి

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జేసీ కుటుంబానికి అనంత వెంకట్రామిరెడ్డి, రఘువీరారెడ్డిలు కొండంత అండగా నిలబడ్డారని, వాళ్లే లేకుంటే ఈరోజు జేసీ కుటుంబం ఎక్కడ ఉండేదని పెద్దారెడ్డి గుర్తుచేశారు. ఒకప్పుడు ఎంతోమందికి టికెట్లు ఇప్పించిన చరిత్ర గల జేసీ కుటుంబం, ఈరోజు సొంత టికెట్ కోసం వెంపర్లాడాల్సిన దుస్థితికి చేరిందని ఎద్దేవా చేశారు. జేసీ ఆలోచనా విధానం సరిగా లేకపోవడం వల్లే ప్రస్తుతం టీడీపీ నాయకులు కూడా ఆయనకు సహకరించడం లేదన్నారు.

అధికారులపై వేధింపులు – గంజాయి సరఫరా

పోలీస్ స్టేషన్లకే తాళాలు వేసిన నల్లటి చరిత్ర జేసీ కుటుంబానిదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. మాట వినని అధికారులను టార్గెట్ చేయడం, బూతులు తిట్టడం జేసీకి అలవాటుగా మారిందన్నారు. తాడిపత్రిలో అధికారుల కనుసన్నల్లోనే యథేచ్ఛగా గంజాయి సరఫరా జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిస్థిమితం లేదని, వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుని మెంటల్ ఆస్పత్రిలో చేరాలని హితవు పలికారు. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి అంతా అబద్ధమని, జేసీ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. చెంచాలతో తిట్టించడం మానుకోవాలని, తాము జేసీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పెద్దారెడ్డి తేల్చిచెప్పారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×