E-Paper
Advertisement

Pawan Kalyan : మీరు దాడి చేస్తే భావ స్వేచ్ఛ.. మేము కేవలం మాట్లాడితే సెక్షన్లు..

Pawan Kalyan : మీరు దాడి చేస్తే భావ స్వేచ్ఛ.. మేము కేవలం మాట్లాడితే సెక్షన్లు..
Advertisement

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాన్ వైకాపా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా కోరుకున్న హింసను తాము ఇవ్వలేమని అన్నారు. విశాఖ గర్జన ప్రకటించిన తరువాతే జనవాణి ప్రకటించామని పవన్ కళ్యాన్ అన్నారు. వైకాపాను కార్యక్రమాలకు ఇబ్బందులను గురిచేయాలని తామెప్పుడూ అనుకోలేదన్నారు.

మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఏ విమర్శలు చేసినా విధానపరంగానే ఉంటాయి గానీ వ్యక్తిగతంగా ఉండవన్నారు. వైకాపా నేతలు దాడులకు దిగితే అప్పటి డీజీపీ భావ స్వేచ్ఛ అన్నారని.. ఇప్పుడు మేము కేవలం మాట్లాడితే సెక్షన్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

Advertisement

అధికారంలో ఉన్న పార్టీ విశాఖ గర్జన అని కార్యక్రమం పెట్టడమేంటని పవన్ ప్రశ్నించారు. క్రిమినల్స్‌కు ఐపీఎస్ ఆఫీసర్లు సెల్యూట్ చేసే దారుణ వ్యవస్థలో మనం ఉన్నామన్నారు. విశాఖ దసపల్లా భూములను ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమేంటన్నారు. ఉత్తరాంత్ర ప్రజలమీద నిజంగా ప్రేమ ఉంటే 71 ఎకరాలను ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందన్నారు. వైకాపా నేతల భూకబ్జాలు బయటపడతాయనే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారన్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×