E-Paper
Advertisement

Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఏపీలో ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు..

Election Commission : ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలకు ఎన్నికల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రకియను ఎన్నికల శాఖ ప్రారంభించింది. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఈసీ ప్రస్తావించింది.

Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఏపీలో ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు..
Advertisement

Election Commission : ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రకియను ఈసీ ప్రారంభించింది. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఈసీ ప్రస్తావించింది. దీంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.

టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరించాలని రాష్ట్రవాప్తంగా ఉన్న డీఈవోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11గంటల లోపు పూర్తి వివరాలు ఇవ్వాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా టీచర్లను నియమించనున్నట్లు ఎన్నికల శాఖ ప్రకటించింది.

Advertisement

గతంలో ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అందుకే ఈ చర్య తీసుకున్నారని ఉపాధ్యాయులు ఆరోపణలు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచేందుకు.. ప్రభుత్వం విద్యా హక్కు చట్టం నియమాల(2010)కు సవరణలు చేసిందని విమర్శించారు.

ఈ చట్టం ద్వారా ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. కేవలం విద్యకు సంబంధించిన కార్యకలపాలకు మాత్రమే పరిమితం చేయాలని సృష్టం చేసింది.

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం-2009లోని సెక్షన్‌ 27 ప్రకారం జనాభా గణన, పార్లమెంటు ఎన్నికలకు, రాష్ట్ర శాసనసభలు, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థలు, సంబంధించిన విధులకు ఉపాధ్యాయులను ఉపయోగించుకోవచ్చు. అయితే విద్యేతర పనులకు వారి సేవలు వినియోగించుకోకుడదని ఆదేశాలు జారీ చేసింది.

అయితే సెక్షన్‌-27లోని నిబంధనలకు అనుగుణంగా బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకే సవరణలు ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే టీచర్లను ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల విధులకు దూరంగా పెట్టారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఎన్నికలలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించేందుకు ఈ సవరణ తీసుకు వచ్చారని ఉపాధ్యాయులు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×