E-Paper
Advertisement

YSRCP : పార్టీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడు కాదా..? కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..!

YSRCP : పార్టీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడు కాదా..? కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..!
Advertisement

YSRCP latest news(AP political news) : తమ పార్టీకి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ తమకు తెలియజేసిందని కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎంపీ రఘురామకృష్ణరాజుకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది. పార్టీ పేరు సవరణ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌కు శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పార్టీ వైపు నుంచి ఎలాంటి ప్రకటన అధికారికంగా చేయలేదు.

Advertisement

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖకు కేంద్రం ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. వైసీపీ ఇచ్చిన సమాచారాన్ని లేఖ ద్వారా రఘురామకృష్ణరాజుకు పంపింది. అలాగే పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ లేదా వైఎస్ఆర్ సీపీ మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ వివరించిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×