E-Paper
Advertisement

Modi : వైట్‌హౌస్‌లో విందు .. మోదీ, బైడన్ ఇచ్చిపుచ్చుకున్న కానుకలు ఇవే..!

Modi : వైట్‌హౌస్‌లో విందు .. మోదీ, బైడన్ ఇచ్చిపుచ్చుకున్న కానుకలు ఇవే..!
Advertisement

PM Modi gifts to Joe Biden(Narendra Modi America Tour): అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులకు ప్రత్యేక కానుకలు అందించారు. వారితో కలిసి వైట్‌హౌస్‌లో విందులో పాల్గొన్నారు. బైడెన్‌తో భేటీ అయ్యారు. మోదీకి 20వ శతాబ్దం ప్రారంభంలో చేతితో తయారు చేసిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలీ, పురాతన అమెరికన్ కెమెరాను బైడెన్‌ కానుకగా ఇచ్చారు.

Advertisement

ఇక జో బైడెన్‌కి మోదీ కూడా విలువైన బహుమానాలు అందించారు. జైపూర్‌కు చెందిన కళాకారుడి చేత ప్రత్యేకంగా తయారు చేయించిన గంధపు పెట్టెను ఇచ్చారు. దానిలోపల వినాయకుడి విగ్రహాన్ని పెట్టి బైడెన్‌ దంపతులకు అందించారు. గంధపు పెట్టెపై రాజస్థాన్‌ పురాతన కళాత్మక, అద్భుతమైన నగిషీలు చెక్కి ఉన్నాయి. పెట్టె లోపల ఉన్న వెండి గణేశుడి విగ్రహాన్ని కోల్‌కతాకు చెందిన ఐదో తరం సిల్వర్‌స్మిత్‌ల కుటుంబంతో చేయించారు. వినాయకుడి విగ్రహంతోపాటు వెండి దీపం కూడా ఇచ్చారు.

ఇక అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు ల్యాబ్ గ్రోన్ 7.5 క్యారెట్ గ్రీన్ డైమండ్ ను మోదీ బహూకరించారు. లండన్‌కు చెందిన ఫేబర్ అండ్ ఫేబర్ లిమిటెడ్ ప్రచురించిన, యూనివర్శిటీ ప్రెస్ గ్లాస్గోలో ముద్రించిన ది టెన్ ప్రిన్సిపల్ అనే పుస్తకం మొదటి ముద్రణ కాపీని బైడెన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు.

Advertisement

జో బైడెన్‌కు మోదీ బహుమతిగా ఇచ్చిన పెట్టెలో 10 విరాళాలు ఉన్నాయి. గోదానం కోసం పశ్చిమ బంగాల్‌లోని నైపుణ్యం కలిగిన కళాకారులచేత సున్నితంగా చేతితో తయారు చేసిన వెండి కొబ్బరికాయను సమర్పించారు. భూదానం కోసం మైసూర్ నుంచి సేకరించిన సువాసనగల గంధపు చెక్కను ఇచ్చారు. తమిళనాడు నుంచి తెచ్చిన తెల్లనువ్వులను అందించారు. బంగారం దానం కోసం రాజస్థాన్‌ కళాకారుల చేత తయారు చేయించిన 24 క్యారెట్ల బంగారు నాణెంను అందించారు. అలాగే వెండినాణెంను కూడా ఇచ్చారు. గుజరాత్‌ నుంచి సేకరించిన ఉప్పు, మహారాష్ట్ర బెల్లాన్ని ఆ పెట్టెలో ఉంచారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×