E-Paper
Advertisement

పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం

పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం
Advertisement

Tirupati Double Murder: తిరుపతి నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. విడిపోయిన కుటుంబాన్ని కలపాలని భావించిన ఇద్దరు మధ్యవర్తులు దారుణ హత్యకు గురయ్యారు. తిరుపతిలోని పద్మావతి కల్యాణ మండపం-1లో రాత్రి ఈ ఘోరం జరిగింది. జంట హత్యల వెనుక అసలేం జరిగింది?

తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం-తిరుమల వ్యాపారి సంపూర్ణమ్మ తన కూతుర్ని ఏర్పేడు మండలానికి చెందిన సునీల్ ఇచ్చి పెళ్లి చేసింది. ఇదంతా ఆరేళ్ల కిందట జరిగింది. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఫ్యామిలీలో ఏర్పడిన కొన్ని సమస్యల కారణంగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు.

Advertisement

బుధవారం రాత్రి తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపంలో జంగాలపల్లి ప్రాంతానికి చెందిన వారి బంధువుల వివాహం జరుగుతోంది. ఈ వివాహానికి అల్లుడు సునీల్ వస్తాడని భావించింది అత్త సంపూర్ణమ్మ. పెద్దలతో మాట్లాడించి తన కూతురు సంసారాన్ని చక్కదిద్దాలని అనుకుంది.

పద్మావతి కళ్యాణ మండపంలో ఘటన-ఈ నేపథ్యంలో ఆనాడు పెళ్లి పెద్దగా వ్యవహారించిన మునిరత్నం యాదవ్‌ను సంప్రదించింది సంపూర్ణమ్మ. తిరుమలలో గాజుల వ్యాపారం చేస్తున్న మునిరత్నం, పెద్దామె మాట కాదనలేక సరేనని అన్నాడు. మునిరత్నం తన స్నేహితుడు మణికంఠను తోడుగా తీసుకుని వివాహ వేడుకకు వచ్చాడు.

Advertisement

కల్యాణ మండపంలో మునిరత్నం-మణికంఠ కలిసి సునీల్‌ను కలిశారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలపై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మాటా మాటా కాస్త పెరిగి తీవ్ర వివాదానికి దారితీసింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీల్, ఫోన్ చేసి తన తండ్రి, తమ్ముడు, అల్లుడ్ని కల్యాణ మండపం వద్దకు రప్పించాడు.

భార్యాభర్తలను కలపేందుకు ప్లాన్..  ఆగ్రహానికి లోనైన యువకుడి బంధువులు

చర్చలు ఫెయిల్ కావడంతో మునిరత్నం-మణికంఠలు తమ వాహనాలపై వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. బయలుదేరుతున్న సమయంలో సునీల్-అతని కుటుంబ సభ్యులు కత్తులతో వారిపై విచక్షణా రహితంగా దాడికి చేశారు. ఈ పరిణామానికి భయపడిన బంధువులు, అక్కడున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. కల్యాణ మండపం నుంచి బయటకు పరుగెత్తున్న వ్యక్తులను వెంటాడి మరీ నరికాడు సునీల్.

ALSO READ: మత విద్వేషాలు రేపితే చర్యలు తప్పవు.. జగన్, ప్రకాష్ రాజ్‌లపై మంత్రి సత్యకుమార్ ఫైర్!

తీవ్రంగా గాయపడిన మునిరత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాల పాలైన మణికంఠ ప్రాణాలను కాపాడుకోవడానికి కల్యాణ మండపం ప్రధాన గేటు వైపు పరుగులు తీశాడు. ఈ ఘటన గురించి సమాచారం తీసుకున్న స్థానికులు వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ కూడా మృతి చెందాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×