E-Paper
Advertisement

Jagan : నేడు అమరావతిలో పేదల ఇళ్లకు శంకుస్థాపన.. వెంకటపాలెంలో బహిరంగ సభ..

Jagan : నేడు అమరావతిలో పేదల ఇళ్లకు శంకుస్థాపన.. వెంకటపాలెంలో బహిరంగ సభ..
Advertisement

Jagan : అమరావతిలో 50,793 ఇళ్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. 45 మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్‌ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు కేటాయించారు. 25 లేఅవుట్‌లు రూపొందించారు. ఈ ఏడాది మే 26న సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.

ఇళ్ల నిర్మాణానికి రూ.1,371.41 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.384.42 కోట్లు వ్యయం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్‌ గ్రంథాలయాలు, 12 హాస్పటల్స్ నిర్మాణాన్ని చేపడతారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.1.68 కోట్లతో 2 దశల్లో 28 వేల మొక్కలను నాటతారు.

Advertisement

ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం సమకూరుస్తుంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్‌ ఫ్రేమ్స్‌ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందిస్తుంది. ఇలా మరో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తుంది. లేఅవుట్‌లో తనకు కేటాయించిన స్థలంలో మోడల్‌ హౌస్‌ నిర్మించడం చాలా ఆనందంగా ఉందని కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నం అన్నారు. స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి తన కలను సీఎం జగన్ సాకారం చేశారని ఆనందం వ్యక్తంచేశారు.

మరోవైపు సీఎం జగన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జనసేన పిలుపునిచ్చింది. మరోసారి ప్రజలను మోసం చేయడానికి సీఎం వస్తున్నారంటూ చలో కృష్ణాయపాలెం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. శంకుస్థాపనలు తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయని సీఎం జగన్ అంటూ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×