E-Paper
Advertisement

Westindies Vs India : పట్టు బిగించిన భారత్.. విండీస్ కు భారీ టార్గెట్..

Westindies Vs India : పట్టు బిగించిన భారత్.. విండీస్ కు  భారీ టార్గెట్..
Advertisement

Westindies Vs India : వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. చివరిరోజు 8 వికెట్లు తీస్తే టీమిండియా సిరీస్ ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుంది. విండీస్ విజయం సాధించాలంటే ఇంకా 289 పరుగులు చేయాలి. ఆఖరి రోజు క్రీజులో నిలబడి అంత స్కోర్ చేయడం ఆ జట్టు బ్యాటర్లకు అంత వీజీ కాదు. బౌలర్లు తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే చెలరేగితే టీమిండియా విజయం లాంఛనమే.

తొలి ఇన్నింగ్స్ లో 229/5 ఓవర్ నైట్ స్కోర్ తో 4 రోజు ఆటను విండీస్ ప్రారంభించింది. అయితే మరో 26 పరుగులు మాత్రమే చేసి 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ముఖేశ్ కుమార్, జడేజాకు తలో రెండు వికెట్లు దక్కాయి. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు చేసింది. దీంతో 183 పరుగుల ఆధిక్యం టీమిండియాకు లభించింది.

Advertisement

రెండో ఇన్నింగ్స్ లో భారత్ ధాటిగా ఆడింది. టీ20 మ్యాచ్ మాదిరిగా టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. రోహిత్ (57), ఇషాన్ కిషన్ ( 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. జైస్వాల్ (38), గిల్ ( 29 నాటౌట్ ) రాణించడంతో రోహిత్ సేన.. కేవలం 24 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఈ స్కోర్ వద్దే రోహిత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. దీంతో మొత్తం 364 పరుగుల లీడ్ భారత్ సాధించింది. 365 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన విండీస్.. 4వ రోజు ఆటముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లు అశ్విన్ కే దక్కాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×