E-Paper
Advertisement

Alluri Bus Accident: అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. బాధితులకు అండగా ఉంటామని హామీ

Alluri Bus Accident: అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. బాధితులకు అండగా ఉంటామని హామీ
Advertisement

Alluri Bus Accident: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు, 35 యాత్రికులు ఉన్నారు. భద్రాచలం ఆలయం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికుల ప్రైవేటు బస్సు అల్లూరి జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్ లో లోయలో పడి పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

యాత్రికుల దుర్మరణం బాధాకరం- పవన్ కల్యాణ్

Advertisement

“అల్లూరి జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలవ్వడం తెలిసి చింతిస్తున్నాను. యాత్రికుల బస్సు చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా సమాచారం అందింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది” -డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Also Read: Bus Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా.. స్పాట్లోనే 8 మంది మృతి

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం- మంత్రి లోకేశ్

Advertisement

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై హోంమంత్రి అనితతో ఫోన్ లో ఆరా తీశానన్నారు. సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగేలా చూడాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×