E-Paper
Advertisement

Chandrababu: మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కుంటుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి?

Chandrababu: మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కుంటుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి?
Advertisement

Chandrababu: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు.. 352 ఎంవోయూలు కుదిరాయని ప్రభుత్వం ప్రకటించింది. 15 విభాగాల్లో పరిశ్రమలు రానున్నాయని.. 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ చెప్పారు. సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిందంటూ వైసీపీ వర్గమంతా ఫుల్ ఖుషీగా ఉంది. అయితే, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరు ప్రస్తావించకుండానే.. ప్రభుత్వంపై పంచ్‌లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కుంటుంటే పెట్టుబడులెలా వస్తాయని ప్రశ్నించారు. విశాఖలో రూ.40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

ఇక, వైసీపీ దౌర్జన్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. సీఎం జగన్ అరాచకాల నుంచి.. ఎంపీ రఘురామ, సుబ్బారావు గుప్తా లాంటి వైసీపీ నేతల్ని కూడా టీడీపీయే కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అధికారపార్టీ అరాచకాల దెబ్బకు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని.. ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రావణ కాష్టం తరహా పరిస్థితులు నెలకొంటే.. టీడీపీ లీగల్‌ సెల్‌ అందుకు ధీటుగా పని చేస్తోందని ప్రశంసించారు చంద్రబాబు.

Advertisement

విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. నాలుగేళ్లలో పార్టీ శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై చర్చించారు. నారాలోకేశ్‌ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులపై సమావేశంలో చర్చ జరిగింది. పాదయాత్రలో లోకేశ్‌పై 12 కేసులు పెట్టారని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులు, పోలీసులను వదలబోమని చంద్రబాబు హెచ్చరించారు. పొలిటికల్‌ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తామని అన్నారు.

ప్రభుత్వ విధానాలను ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమకేసులు బనాయించే పోలీసులను ఉపేక్షించేది లేదని, చేసిన తప్పులకు వారు శిక్ష అనుభవించాల్సిందేని మండిపడ్డారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×