E-Paper
Advertisement

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..
Advertisement

Durga temple: తిరుమల లడ్డూ వివాదం ముగియక ముందే దుర్గ టెంపుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దుర్గగుడిలో నాసిరకం సరుకులపై వినియోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రస్తుతం అంతర్గత విచారణ జరుగుతోంది.

వైసీపీ హయాంలో చేసిన పనులు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు వచ్చే దేవాలయాల్లో ప్రసాదాలు నాసిరకంగా ఉండడంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది.

Advertisement

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకుల వ్యవహారంపై దేవాదాయ శాఖలో అంతర్గత విచారణ జరుగుతోంది. రెండురోజుల తనిఖీల్లో రూ. 15 లక్షల రూపాయల విలువైన నాసిరకం సరుకులు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ముఖ్యంగా అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్‌లో పని చేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్రమాణాలు పాటించకపోవడంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఉద్యోగులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో రిపోర్టు ఆ శాఖ అందనుంది. ఆ తర్వాత విజిలెన్స్ విచారణ చేయిస్తుందా? అనేది తెలియాల్సివుంది.

Advertisement

ALSO READ: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో

ఇదేకాకుండా అటు అన్నవరం, సింహాచలం దేవాలయాల్లో ఇదే సమస్య తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం వెలుగులోకి రాగానే అన్నవరం దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. నెయ్యిను తనిఖీకి పంపించారు. దానిపై రెండురోజుల్లో నివేదిక రానుంది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×