E-Paper
Advertisement

Road Accident: కొత్తసంవత్సరంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Road Accident: కొత్తసంవత్సరంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
Advertisement

Road Accident: కొత్తసంవత్సరం అంతా బాగుండాలని, ఎలాంటి విషాదాలు వద్దని ఎంత కోరుకున్నా.. కొన్ని సంఘటనలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించడంతో.. మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎదురుగా వస్తున్న బైక్ ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఎస్సై నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. పాపాయిపల్లికి చెందిన పవన్ (20), శ్రీనివాస్ (21), రాహుల్ (21) టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ఎదురుగా గిద్దలూరు నుంచి వస్తున్న బొలెరో వాహనం బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×