E-Paper
Advertisement

Bank Account : కస్టమర్ ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ.. జర జాగ్రత్త..

Bank Account : కస్టమర్ ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ.. జర జాగ్రత్త..
Advertisement
Bank Account

Bank Account : వినియోగదారుడి ప్రమేయం లేకుండా నకిలీ వేలిముద్రల సాయంతో, ఆధార్ కార్డు ఎనేబుల్ చేసుకుని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ వేలిముద్రల తయారీ పరికరాలను సీజ్ చేశారు.

Advertisement

గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వేంకటేశు, అజయ్, కళ్యాణ్, షేక్ జానీ, గోపిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై దేశంలోని పలు రాష్ట్రాలలో సుమారు 416 AEPS నేరాలు చేసినట్లు విచారణలో తేలినట్లు జిల్లా ఎస్పి అన్బు రాజన్ వివరించారు.

సైబర్ నేరగాళ్ల వ్యవహారంపై సాంకేతికంగా నిఘా ఉంచడంతో గుంటూరు యూనియన్ బ్యాంక్ నుంచి డేటా సేకరించి, నిందితులు గుంటూరు జిల్లా నుంచి పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. వీరి బ్యాంకు ఖాతాల ద్వారా 5.9 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు విచారంలో తేలింది.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా వేలిముద్రలు, ఆధార్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం నిందితుల దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఖాతాల్లో నగదు పోయిన బాధితులంతా ఫిర్యాదు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ సూచించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×