E-Paper
Advertisement

AP New Ration Card: మీరు రేషన్ కార్డుకు అప్లై చేశారా? ఈ సర్వే లో తప్పక పాల్గొనండి!

AP New Ration Card: మీరు రేషన్ కార్డుకు అప్లై చేశారా? ఈ సర్వే లో తప్పక పాల్గొనండి!
Advertisement

AP New Ration Card: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీ ప్రభుత్వం ఓ పెద్ద చర్యను చేపట్టింది. మీరు ఇప్పటికే అప్లై చేసి ఉంటే, లేదా అప్లై చేయాలనుకుంటే.. ఈ అంశాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈసారి కచ్చితమైన డేటాతో, అర్హులకే సేవలు అందించాలన్న దిశగా ముందడుగు వేసింది. ఇక నుంచి రేషన్ కార్డులు కొత్త పద్ధతిలో ఈ-కేవైసీ ద్వారా మాత్రమే ఇవ్వబడతాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఓ విస్తృత సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ప్రజల డేటాను సేకరించి, నకిలీ రేషన్ కార్డులను తొలగించి, అర్హత కలిగిన వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

ఈ సర్వేలో భాగంగా ప్రభుత్వం ఇంటింటికీ వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేస్తోంది. ప్రతి ఇంటికి చెందిన ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయం వంటి ముఖ్యమైన అంశాలను రికార్డ్ చేస్తోంది. ఈ సమాచారం ఆధారంగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాకే కొత్త కార్డు జారీ చేయనున్నారు.

ఇప్పటికే పాత కార్డులతో నిత్యావసర వస్తువులు పొందుతున్నవారికి బియ్యం, కందిపప్పు, చక్కెర, ఆయిల్ వంటి రేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కానీ కొందరికి కార్డులు లేకపోవడం, కొందరికి తప్పులుతో ఉండటం, మరికొందరికి పాతవే ఉన్నా అవి తప్పుడు వివరాలతో ఉండడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే కారణంగా ప్రభుత్వం ఇప్పుడు బోగస్ కార్డులను తొలగించే దిశగా చర్యలు తీసుకుంటోంది.

Advertisement

ఈ సర్వేలో ముఖ్యంగా చూస్తున్న అంశం.. మీరు నిజంగా అర్హులా కాదా అన్నది. ఆదాయం, కుటుంబ స్థితిగతులు, ఉద్యోగ వివరాలు మొదలైనవి అన్నీ ఈ నిర్ణయంలో కీలకంగా ఉంటాయి. ఎవరైనా నిబంధనలకు లోబడే వారు అయితే, కొత్త రేషన్ కార్డును పొందొచ్చు.

ఇది కేవలం సరుకుల పంపిణీకి మాత్రమే కాకుండా, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు కీలకంగా మారుతుంది. ఉదాహరణకు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వైద్య భీమా, పింఛన్లు వంటి అనేక రకాల పథకాల కోసం రేషన్ కార్డు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

Also Read: Health Tips: యువత ఈ ఫుడ్ తీసుకుంటే.. బెస్ట్ హెల్త్ మీదే..

ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు సమర్పించడం ప్రారంభించారు. మీరూ ఇంకా అప్లై చేయకపోతే, మీ గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి. అలాగే, మీ ఆధార్‌తో ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఇది లేకపోతే కొత్త కార్డు వచ్చే అవకాశం లేదు.

కొందరికి ఇప్పటికే ఉన్న కార్డులో పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాల్లో తప్పులుంటే.. ఇప్పుడే సరి చేసుకునే సువర్ణావకాశం. అలాగే కొత్తగా పెళ్లై విడిపోయిన వారు, వేరుగా జీవిస్తున్న కుటుంబాలు కూడా ఇప్పుడు కొత్త కార్డుకు అప్లై చేసుకోవచ్చు.

ఈ సర్వే పూర్తయ్యాక ప్రభుత్వం కొత్త కార్డులను జారీ చేస్తుంది. పాత, బోగస్ కార్డులను రద్దు చేస్తుంది. ఇలా చేయడం వల్ల నిధులు సరైన వారికి చేరతాయి. ఇది ప్రభుత్వ న్యాయబద్ధ పాలనకు దోహదపడుతుంది.

మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినా, ఇంకా చేయకపోయినా.. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్వే మరియు ఈ-కేవైసీ ప్రక్రియ గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. నిజమైన అర్హులకు మాత్రమే కార్డులు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కనుక మీ సమాచారం సరిగ్గా నమోదు చేయించుకోండి. ఏదైనా సందేహం ఉంటే, వెంటనే మీ స్థానిక సచివాలయం లేదా మీ సేవ కేంద్రాన్ని సంప్రదించండి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×