E-Paper
Advertisement

Pawan Kalyan: వివాదంలో పవన్ కల్యాణ్.. బూట్లు విప్పకుండా అలా చేయడంతో విమర్శలు

Pawan Kalyan: వివాదంలో పవన్ కల్యాణ్.. బూట్లు విప్పకుండా అలా చేయడంతో విమర్శలు
Advertisement

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో వివాదం చిక్కుకున్నారు. పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ పర్యటనలో పవన్ చేసిన ఓ పని రాజకీయ దుమారం రేపుతోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ పరిశీలిస్తున్న సమయంలో.. ఒకరు దేవుని ప్రతిమ అందించారు. ఈ ప్రతిమ స్వీకరించే సమయంలో పవన్ కల్యాణ్ షూ విప్పలేదు. పక్కనున్న వాళ్లు దీనిని వీడియోలు తీశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే పుస్తకం తీసుకునే సమయంలో.. అది కింద పడుతుంటే కనీసం పట్టుకోకుండా వదిలేశారని కామెంట్స్ చేస్తు్న్నారు.

వైసీపీ విమర్శలు

Advertisement

ఈ వీడియోను వైసీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ.. పవన్ కల్యాణ్ కపట భక్తికి నిదర్శనమని విమర్శలు గుప్పించింది. ‘‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి అపచార పనులు’’ అంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్, ఆచరణలో మాత్రం దైవ గౌరవాన్ని విస్మరించారని ఆరోపించింది. పవన్ కల్యాణ్, జగన్ వీడియోలు పక్కపక్కనే పెట్టి వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో జగన్ చెప్పులు విప్పి దేవుని ప్రతిమ తీసుకోగా.. పవన్ షూతో దేవుని ప్రతిమ పట్టుకున్నట్లు కనిపిస్తుంది.

Also Read: నేను నెం 1 కాదు… టాలీవుడ్‌లో తన స్థానంపై పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ 

పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

Advertisement

ఈ సంక్రాంతి నుంచి కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయనే మాటలు పోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ “పిఠాపురం చాలా కీలకమైన శక్తి పీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఇది. ఏ రోజు కూడా సినిమాల్లో నటించాలి, రాజకీయాల్లో పోటీ చేయాలని అనుకోలేదు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు” అన్నారు.

రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు

“గత 18 నెలల్లో పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత ఏడాది దాదాపు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే… ఈ ఏడాది రూ. 211 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గత ప్రభుత్వ పాలనలో ఇంత ఖర్చు చేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నన్ను బలోపేతం చేస్తే మరింతగా పని చేస్తా. అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు ఇక్కడి ప్రజల కోసం పనిచేస్తాను. నాయకుడు అవసరం లేని వ్యవస్థను నిర్మించడమే నిజమైన అభివృద్ధి. అలాంటి అభివృద్ధి కోసమే మేమంతా శ్రమిస్తున్నాం”- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×