E-Paper
Advertisement

AP CEO on Elections 2024: ఏపీలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది: ఎంకే మీనా

AP CEO on Elections 2024: ఏపీలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది: ఎంకే మీనా
Advertisement

AP CEO on Lok Sabha Elections 2024 Polling: ఏపీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతోందని ఏపీ సీఈవో ముకేష్ కుమార్ తెలిపారు. ఏపీ పోలింగ్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణనలు జరిగాయని తెలిపారు.

కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం అని చెప్పారు. అన్నమయ్య జిల్లాలోనూ ఘర్షణలు జరిగాయన్నారు. పల్నాడు జిల్లాలో ఒక చోట ఈవీఎంలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.ఈవీఎంలను మార్చి రీపోలింగ్ తిరిగి ప్రారంభించామన్నారు. ఈవీఏం చిప్ లో డేటా భద్రంగా ఉంటుందని వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని స్పష్టం చేశారు.

Advertisement

అక్కడక్కడా ఈవీఎంల్లో సమస్యలు వచ్చినా ఈవీఎంలను మార్చామని తెలిపారు. పల్నాడు, తెనాలి, అనంతపురంలో కొందరిని గృహ నిర్భందం చేశామని చెప్పారు. ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టడంతో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని తెలిపారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఇంకా కొనసాగుతుందని అన్నారు.

ఘర్షణలకు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 20 వేల యంత్రాలను అదనంగా ఉంచామని తెలిపారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని తమకు ఇంటలిజెన్స్ నుంచి ముందే సమాచారం అందిందని తెలిపారు. మాచర్లలో ఈవీఎంలు దెబ్బతిన్నాయని అన్నారు. 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి తిరిగి పోలింగ్ నిర్వహించామని తెలిపారు

Advertisement

Also Read: ఏపీలో ముగిసిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్

సుమారు 200 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ కొనసాగే అవకాశం ఉందన్నారు.  గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. 5 గంటల వరకూ 68 శాతం వరకు పోలింగ్ నమోదైందని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరుస్తామని తెలిపారు. తుది వివరాలు పోలింగ్ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామన్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×