E-Paper
Advertisement

అమరావతికి మోదీ సర్కార్ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్లతో అద్భుతమైన సెంట్రల్ సెక్రటేరియట్!

అమరావతికి మోదీ సర్కార్ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్లతో అద్భుతమైన సెంట్రల్ సెక్రటేరియట్!
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో భారీ ముందడుగు పడింది. నవ్యాంధ్ర రాజధానిని పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భారీ వ్యయంతో సెంట్రల్ సెక్రటేరియట్  నిర్మాణానికి రంగం సిద్ధమైంది. దీనికోసం మొత్తం రూ. 2,534 కోట్లు మోదీ సర్కార్ వెచ్చించనుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ నివేదిక కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం వేచి చూస్తోంది.

అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టులో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. అందులో మొదటిది కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం. దీని నిర్మాణం కోసం రూ. 1,299.08 కోట్లు కేటాయించారు. ఈ భవన సముదాయంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలు కొలువుదీరుతాయి. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు సహా ఇతర ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ విభాగాలన్నీ ఇకపై ఒకే చోట నుంచి తమ కార్యకలాపాలు సాగించే అవకాశం ఉంటుంది. ఇది పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు సేవలందించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

Advertisement

ప్రాజెక్టులో రెండవ భాగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు. దీనికోసం రూ. 1,234.91 కోట్లు ఖర్చు చేయనున్నారు. సెక్రటేరియట్‌లో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం అత్యాధునిక వసతులతో కూడిన క్వార్టర్లను నిర్మిస్తారు. కేవలం కార్యాలయాలే కాకుండా ఉద్యోగులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను రాజధాని ప్రాంతంలోనే కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అమరావతిని ఒక శక్తివంతమైన ఎకనామిక్ హబ్‌గా మార్చాలన్న సంకల్పంతో కేంద్రం ఈ భారీ నిధులను మంజూరు చేసేందుకు మొగ్గు చూపుతోంది.

సీపీడబ్ల్యూడీ రూపొందించిన ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడమే తరువాయి. ఈ ప్రాజెక్టు అమరావతి అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల రాకతో రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నిర్మించే ఈ భవనాలు రాజధాని నగర రూపురేఖలను మార్చనున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న ఈ సహకారం అత్యంత కీలకం కానుంది.

Advertisement

త్వరలోనే భూమి పూజ జరిపి పనులను ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో అమరావతిలో పరిపాలన వేగవంతం కావడమే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల సరసన రాజధాని నిలవనుంది. కేంద్ర కేబినెట్ నుంచి పచ్చజెండా రాగానే టెండర్ల ప్రక్రియ మొదలై నిర్మాణ పనులు పట్టాలెక్కనున్నాయి.

ALSO READ:3 నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్.. ఆదిలాబాద్‌కు డబుల్ ధమాకా, రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×