E-Paper
Advertisement

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Advertisement

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవం జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. కొత్త జిల్లాలపై ఎల్లుండి తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాకు కేటాయించారు. రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కేటాయించారు. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన

రాయచోటిని మదనపల్లెకు కేటాయించడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం కంటతడి పెట్టుకుంటూ బయటకు వచ్చారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మరో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఓదార్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో లేకపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.

Advertisement

Also Read: Pawan Kalyan : పవన్‌కు అక్కడ నో.. ఇక్కడ ఎస్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×