E-Paper
Advertisement

Tirumala latest news: బోనులో చిక్కిన నాలుగో చిరుత.. ఇక అలిపిరి నడకమార్గం సేఫేనా..?

Tirumala latest news: బోనులో చిక్కిన నాలుగో చిరుత.. ఇక అలిపిరి నడకమార్గం సేఫేనా..?
Advertisement
Another cheetah caught in tirumala

Another cheetah caught in tirumala(Latest telugu news in AP) :

తిరుమలలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుతను ట్రాప్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకు 4 చిరుతలు చిక్కాయి. తొలుత జూన్ 24న ఓ చిరుతను బంధించారు. ఆ తర్వాత ఆగస్టు 14, 17, 28 తేదీల్లో మిగిలిన మూడు చిరుతలను పట్టుకున్నారు.

నాలుగో చిరుతను బంధించేందుకు వారం రోజులుగా అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిరుత అనేకసార్లు బోను వరకు వచ్చి వెనక్కివెళ్లిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. ఆదివారం రాత్రి మరోసారి బోను వద్ద చిరుత వచ్చింది. లోపలకి వెళ్లి చిక్కుకుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

నాలుగో చిరుత కూడా చిక్కడంతో ఆపరేషన్‌ చిరుత విజయవంతమైందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 2 నెలల కిందట కౌశిక్ అనే బాలుడిపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత బోనులో చిక్కింది. ఇకపై అలిపిరి నడకమార్గంలో భక్తులు చిరుత భయం లేకుండా వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. నాలుగు చిరుతలను బంధించడంతో ఇక నడకమార్గం సురక్షితమేనా? భక్తులు ఏలాంటి భయాలు లేకుండా వెళ్లొచ్చా..?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×