E-Paper
Advertisement

Neeraj Chopra : ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా.. వరల్డ్ అథ్లెటిక్స్‌లో భారత్ కు తొలి గోల్డ్..

Neeraj Chopra : ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా..  వరల్డ్ అథ్లెటిక్స్‌లో భారత్ కు తొలి గోల్డ్..
Advertisement

Neeraj Chopra : నీరజ్‌ చోప్రా మరోసారి అద్భుతం సృష్టించాడు. ఒలింపిక్స్ లో స్వర్ణంతో మెరిసిన ఈ స్టార్.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ సాధించిన తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

పురుషుల జావెలిన్‌ త్రో విశ్వ విజేతగా నీరజ్ చోప్రా నిలిచాడు. జావెలిన్ 88.17 మీటర్లు విసిరి పసిడిని కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్‌ అథ్లెట్ అర్షద్‌ నదీమ్‌ 87.82 మీటర్లు విసిరి రజతం సాధించాడు. చెక్‌ ప్లేయర్ వద్లెచ్‌ 86.67 మీటర్లు త్రోతో కాంస్యం అందుకున్నాడు.

Advertisement

ఇప్పటి వరకు ప్రపంచ అథ్లెటిక్స్‌ చరిత్రలో భారత్‌కు మూడు పతకాలు మాత్రమే లభించాయి. గతంలో రెండు మెడల్స్ మాత్రమే వచ్చాయి. మహిళల లాంగ్‌జంప్‌లో అంజు బాబి జార్జ్‌ 2005లో కాంస్యం సాధించింది. గతేడాది నీరజ్‌ చోప్రా రజతం కైవసం చేసుకున్నాడు. తాజాగా స్వర్ణం చేజిక్కించుకుని చరిత్ర సృష్టించాడు.

తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఫౌల్‌ చేశాడు. రెండో త్రోను 88.17 మీటర్ల దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 86.32 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 84.64 మీటర్లు , ఆ తర్వాత 87.73 మీటర్లు, 83.98 మీటర్లు విసిరాడు. రెండో త్రోనే నీరజ్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. మరో ఇద్దరు భారత్ ప్లేయర్ కిశోర్‌ జెనా 84.77 మీటర్లు విసిరి అయిదో స్థానంలో నిలిచాడు. మను 84.14 మీటర్లు త్రో చేసి ఆరో స్థానంలో ఉన్నాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×