E-Paper
Advertisement

Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్‌.. కేసీఆర్‌ ఓటమితో జోష్‌లో టీడీపీ..

Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్‌.. కేసీఆర్‌ ఓటమితో జోష్‌లో టీడీపీ..
Advertisement

Andhra Pradesh : తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీలో తెలుగు తమ్ముళ్లు జోష్‌లో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో కేసీఆర్‌ ఓటమిని ప్రస్తావిస్తూ.. జగన్‌కు కూడా అదే గతి పడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో కొద్దో గొప్పో అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌నే ప్రజలు ఓడించారని.. అలాంటి ఏపీలో ఏమాత్రం అభివృద్ధి చేయని జగన్‌కు జనం ఓటమి రుచి చూపిస్తారని ధీమాలో ఉన్నారు. తెలంగాణ, కర్ణాటన మాదిరే ఏపీలోనూ ప్రజలు మార్పు కోరుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు.

మరికొన్ని రోజుల్లోనే ఏపీలోనూ ప్రజా క్షేత్ర యుద్ధం జరగనుంది. అధికారంపై కన్నేసిన చంద్రబాబు తిరిగి సీఎం సీటును దక్కించకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అవకాశం దొరికినప్పుడల్లా జగన్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ వర్సెస్‌ టీడీపీ పొలిటికల్‌ వార్‌లో భాగంగా తెలంగాణ ఫలితాలను వాడుకుంటున్నారు టీడీపీ అధినేత. పక్కరాష్ట్రాల మాదిరి ఏపీలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. జగన్‌ కు ఓటమి తప్పదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేసీఆర్‌ ఓటమి టీడీపీ శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఏపీ వాసులు కూడా మార్పు కోరుకుంటే తమదే అధికారమన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×