E-Paper
Advertisement

Sharmila: పిల్లలకు ఆస్తులు రాసిచ్చిన షర్మిల.. జగన్ వల్లేనా?

Sharmila: పిల్లలకు ఆస్తులు రాసిచ్చిన షర్మిల.. జగన్ వల్లేనా?
Advertisement
sharmila childrens

YS Sharmila latest news(Telugu news headlines today): వైఎస్‌ షర్మిల మాత్రం ఎందుకో తన ఆస్తిని పిల్లల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడం ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది. ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని కుమారుడి పేరుతో.. 2 ఎకరాల 12 సెంట్ల స్థలాన్ని కూతురు పేదమీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం కుటుంబ సభ్యులు స్వయంగా రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు వెళ్లారు.

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్తుల పంపకం చేశారు. కడప జిల్లాలోని వేంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల తన పేరు మీదున్న కొన్ని ఆస్తులను కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలికి బదిలీ చేశారు. ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న షర్మిల అక్కడి నుంచి కారులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటికే సిద్ధంగా ఉన్న డాక్యుమెంట్ల మీద కొడుకు, కూతురితో కలిసి ఆమె సంతకాలు చేశారు. గతంలో తాను కొనుగోలు చేసిన నిమ్మతోటను సైతం కుమార్తె పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు షర్మిల.

Advertisement

షర్మిల ఆస్తుల పంపకం పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. పిల్లలు మేజర్లు కావడం వల్లే వాళ్ల పేరుతో భూ రిజిస్ట్రేషన్‌ చేయించారా లేదంటే మరైవైనా కారణాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. శనివారం ఇడుపులపాయలో వైఎస్ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అంతకుముందే శుక్రవారమే షర్మిల.. ఇడుపులపాయకు సంబంధించిన భూమిని పిల్లల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీనివెనకాల రీజన్‌ ఏం అయ్యింటుందనే చర్చ జరుగుతోంది.

తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌తో షర్మిలకు విబేధాలు వచ్చాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. చాలా విషయాల్లో అది నిజమే అనే సందేహాలు వచ్చాయి. షర్మిల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనా జగన్‌ స్పందించకపోవడం ఊహాగానాలకు తావిచ్చేలా చేసింది. అలాగే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం కూడా హాట్ టాపిక్‌ అయింది. విధానపరమైన నిర్ణయాల్లో ఏపీ ప్రభుత్వంపైనా షర్మిల విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనక వైఎస్‌కు సంబంధించిన ఆస్తుల పంపకాల విషయంలోనే తేడాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే షర్మిల ఇడుపులపాయ భూమిని పిల్లల పేరుతో మార్చేశారు అనే టాక్‌ నడుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×