E-Paper
Advertisement

Padma: చిన్నజీయర్ స్వామికి పద్మభూషణ్.. కీరవాణికి పద్మశ్రీ.. అవార్డుల్లో సంచలనాలు..

Padma: చిన్నజీయర్ స్వామికి పద్మభూషణ్.. కీరవాణికి పద్మశ్రీ.. అవార్డుల్లో సంచలనాలు..
Advertisement

Padma: రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు తాగే ORSను తయారు చేసిన దిలీప్ కి మరణానంతరం దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషన్ వరించింది.

Advertisement

మొత్తం 106 పద్మ పురస్కారాలు ప్రకటించారు. ఆరుగురికి పద్మవిభూషన్, తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. ములాయం సింగ్ యాదవ్, ఎం.ఎస్.కృష్ణలకు పద్మవిభూషన్ ఇచ్చారు.

తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. చినజీయర్ స్వామికి, కమలేశ్ బి పటేల్(దాజీ)కి, గాయని వాణి జయరాం, సుదామూర్తిలకు పద్మభూషన్ పురస్కారం లభించింది.

Advertisement

తెలంగాణకు 2 పద్మశ్రీలు, ఏపీ నుంచి ఏడుగురికి పద్మశ్రీలు వచ్చాయి. సంగీత దర్శకులు కీరవాణికి పద్మశ్రీ పురష్కారం వరించింది.

ఏపీ నుంచి సంకురాత్రి చంద్రశేఖర్ కు.. తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి.. పద్మశ్రీ పురస్కారం లభించింది.

కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ ప్రముఖ శాస్త్రవేత్త, సంఘ సేవకులు. కాకినాడలో సంకురాత్రి ఫౌండేషన్, శ్రీ కిరణ్ ఐ హాస్పిటల్ స్థాపించారు. సుమారు 3 లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్స అందించారు. శారదా విద్యాలయంలో వేలాది మందికి విద్యాదానం చేశారు. ఇలా, విద్య, వైద్య విభాగంలో ఎనలేని సేవ చేశారు.

చంద్రశేఖర్ రాజమండ్రిలో చదువుకున్నాడు. ఆంధ్రా యూనివర్సిటీలో M.Sc. చేశారు. 1967లో కెనడాలో జీవశాస్త్రంలో పి.హెచ్.డి. చేసి.. కెనడా హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేశారు. 1985 జూన్ 23న ఉగ్రవాదులు పేల్చివేసిన కనిష్క విమానంలో భార్య మంజరి, కుమార్తె శారద, కుమారుడు శ్రీ కిరణ్ లను పోగొట్టుకున్నారు. ఈ దుర్ఘటన తరువాత కాకినాడ వచ్చేసి.. కుమారుడి పేరుమీదుగా శ్రీ కిరణ్ నేత్ర విజ్ఞాన సంస్థను ప్రారంభించి.. సంకురాత్రి ఫౌండేషన్ తో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గతంలో CNN హీరోగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. సంకురాత్రి చంద్రశేఖర్ ను పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తోంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×