E-Paper
Advertisement

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు.. గంటల వ్యవధిలో తల్లులు, కొడుకులు మృతి..

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు.. గంటల వ్యవధిలో తల్లులు, కొడుకులు మృతి..
Advertisement

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. కొడుకులు చనిపోయిన గంటల వ్యవధిలోనే వారి తల్లులు సైతం గుండెపోటుతో మరణించారు. ప్రాంతాలు వేరైనా.. గుండెపోటుకు గురై నలుగురు మృతి చెందడంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గుండెపోటుతో తల్లీ, కొడుకు మృతి చెందారు. ఈ ఘటన హవేలి ఘనపుర్ మండలం కూచన్ పల్లిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు. కొడుకు మరణవార్త విన్న తల్లి లక్ష్మి.. గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. తల్లీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

ఏపీలోని చిత్తూరు నగరంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చిత్తూరు నగరంలో కూమారుడు మరణించాడని తల్లి అవేదనతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. నగరంలోని కట్టమంచికి చెందిన సురేంద్రరెడ్డి(58) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించాడు. కుమారుడుడిని అచేనంతగా చూసిన తల్లి సుశీలమ్మ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడి మృతి.. తట్టుకోలేక షాక్ గురై మరణించిందని డాక్టర్లు తెలిపారు. ఒకేసారి ఇద్దరు తల్లులు, ఇద్దరు కొడుకుల మరణాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×