E-Paper
Advertisement

Summer: ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండ.. సమ్మర్ సెగ మొదలైందా?

Summer: ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండ.. సమ్మర్ సెగ మొదలైందా?
Advertisement

Summer: మొన్ననే శివరాత్రి అయింది. శివరాత్రికి శివ శివ అంటూ చలికూడా వెళ్లిపోయింది. అప్పుడే ఎండ మండుతోంది. పగటి పూట బయటకు వస్తే.. ఎండ మంట సుర్రున తగులుతోంది. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ కాస్త బెటర్‌గా ఉంటున్నా.. మధ్యాహ్నం ఎండే కాలిపోతోంది. ఆ ఎండను చూసి అప్పుడే వేసవికాలం వచ్చేసిందా? అనే అనుమానం మొదలైంది. అదేంటి, ఫిబ్రవరిలోనే ఎండ మండిపోవడం ఏంటనే చర్చ స్టార్ట్ అయింది. మరి, సైంటిస్టులు ఏమంటున్నారంటే….

పర్వత ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షపాతం తగ్గడంతో పాటు, పొడి వాతావరణం ఉండటం వల్ల పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులు నేరుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయట. ఫలితంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు, మధ్యధరా ప్రాంతంలో తుపానులు లేకపోవడం కూడా టెంపరేచర్ పెరగడానికి ఓ కారణం అంటున్నారు. గుజరాత్‌లో యాంటీ సైక్లోన్లు ఏర్పడి.. సముద్రం మీదుగా వచ్చే చల్లని గాలులు భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని ఇదికూడా రీజనేనని చెబుతున్నారు.

Advertisement

అయితే, ప్రస్తుతం ఉన్న ఎండ వేడి ఎన్నో రోజులు ఉండదంటూ భరోసా ఇస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సాధారణం కంటే ఎక్కువగానే టెంపరేచర్ నమోదవుతుందని అంటున్నారు. వేసవికాలం ముందుగా వచ్చిందని ఇప్పుడే చెప్పలేమని.. ప్రస్తుత ఉష్ణోగ్రతలు వేసవి ప్రారంభానికి సంకేతాలు కావనేది సైంటిస్టుల మాట.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×